దారుణం: చేతబడి నెపంతో వ్యక్తి సజీవదహనం
మహబూబ్నగర్: జిల్లాలోని కోడేరు మండలం రాజాపూర్లో దారుణం చోటు చేసుకుంది. చేతబడి నెపంతో రాములు(50) అనే వ్యక్తిపై గ్రామస్థులు కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో వ్యక్తి సజీవదహనమయ్యాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బండరాయిని ఢీకొట్టిన బస్సు: నలుగురు విద్యార్థులకు గాయాలు
మహబూబ్నగర్ జిల్లాలోని ధరూర్ మండలం పార్చర్ల వద్ద పాఠశాల బస్సుకు ప్రమాదం తప్పింది. ప్రమాదవశాత్తు బస్సు ఓ బండరాయిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. కాగా మరో ముగ్గురు విద్యార్థులకు స్వల్పగాయాలైయ్యాయి. చికిత్స నిమిత్తం విద్యార్థులను సమీప ఆస్పత్రికి తరలించారు.
చేపలవేటకు వెళ్లి యువకుడి మృతి
చేపలవేటకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందిన ఘటన ఆత్మకూర్ మండలం దేవర్పల్లి గ్రామ శివారులో జరిగింది. గ్రామానికి చెందిని రామారావు, చెన్నమ్మ దంపతుల కుమారుడైన సంతోష్(32) ఆదివారం మధ్యాహ్నం వూకచెట్టివాగులో చేపల వేటకు వెళ్లాడు.
సాయంత్రమైనా ఇంటికి తిరిగిరాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు, బంధువులు అతని కోసం వాగులో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి వాగులో సంతోష్ మృతదేహాన్ని గుర్తించారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
లారీ-కారు ఢీ: వ్యక్తి మృతి
నల్గొండ జిల్లాలోని చిట్యాల దగ్గర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ-కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.