Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జనసేనతో పొత్తు పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు - బందీ అయింది..!!

తెలంగాణలో బీజేపీ ఎన్నికల అజెండా పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణకు బీసీ నేత ను ముఖ్యమంత్రిని చేయటమే బీజేపీ లక్ష్యమని చెప్పారు. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. తెలంగాణలో మార్పు రాదన్నారు. మిగిలిన సీట్లకు అభ్యర్దులు..జనసేనతో పొత్తు వ్యవహారం పైనా స్పందించారు. అదే సమయంలో బీజేపీకి బీఆర్ఎస్‌తో ఎలాంటి సంబంధాలు లేవని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తున్నామని తెలిపారు.

కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు:తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌ కామారెడ్డిలోనూ, గజ్వేల్‌లోనూ ఓటమి పాలవుతారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. డబ్బుతో అభ్యర్థులు, నాయకులను కొనవచ్చు కాని, ప్రజల కోపాన్ని తగ్గించలేరని తెలిపారు.హుజురాబాద్‌ ఉపఎన్నికల్లో వచ్చిన ఫలితమే తెలంగాణవ్యాప్తంగా రాబోతోందని కిషన్‌రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ యువత సునామిలా విజృంభించి బీఆర్‌ఎస్‌ను తుడిచిపెడుతుందని ప్రకటించారు. ప్రజా ఆందోళనలను అణిచివేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం, మంత్రులను కలిసే వీలు లేకుండా పోయిందన్నారు. దళితుడిని సీఎం చేస్తానని.. కేసీఆర్ మాట తప్పారని.. ఉద్యోగ నియామకాల్లో విఫలమయ్యారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Union minister Kishan Reddy made interesting comments over Alliance with Janasena in TS Elections

ఏపీ రోడ్లపై కేసీఆర్ కు సమాధానం:కేసీఆర్ ఏపీ రోడ్ల గురించి మాట్లాడుతున్నారని, కేంద్రం నిధులివ్వకుంటే తెలంగాణలో రోడ్లు ఎక్కడివని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో ఎన్‌హెచ్‌లు, రైల్వేల అభివృద్ధికి.. రాష్ట్రానికి కేంద్రం భారీగా నిధులిచ్చిందన్నారు. తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం పాత్ర కీలకమని చెప్పారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని, ఒక కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయిందని కిషన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఆకాంక్షలకు విరుద్ధంగా బీఆర్‌ఎస్‌ పాలన సాగుతోందని, దళితుడిని సీఎం చేస్తామని కేసీఆర్‌ మాట తప్పారని, నియంతలా పరిపాలిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు లేకుండా చేశారని, రాష్ట్రంలో ప్రజలు సీఎంను కలిసే అవకాశమే లేదని అన్నారు.

జనసేనతో అందుకే పొత్తు:జనసేన ఎన్డీయే భాగస్వామి కాబట్టే ఆ పార్టీతో పొత్తు ఉందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కే తెలంగాణ ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పై కూడా కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. గ్యారెంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్‌ పార్టీ మోసం చేస్తోందని కిషన్‌ రెడ్డి అన్నారు. ఐదేళ్లలో వచ్చే వ్యతిరేకత కర్నాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఐదు నెలల్లోనే వచ్చిందని విమర్శించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు డబ్బు పంపించేందుకు కర్నాటక కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేక ట్యాక్స్ వసూలు చేస్తోందని ఆరోపించారు. తెలంగాణకు బీసీ నేత ను ముఖ్యమంత్రిని చేయటమే బీజేపీ లక్ష్యమని చెప్పారు

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+