మహిళలు, యువతుల ఫొటోలు, వీడియోలు అప్లోడ్: ఆ ఇన్స్టా పేజీపై కేసు నమోదు
హైదరాబాద్: మహిళలు, ముఖ్యంగా యువతుల ఫొటోలను వారి అనుమతి లేకుండానే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. అంతేగాక, అసభ్యకరమైన శీర్షికలతో యువతులు, మహిళలు ఫొటోలు పెడుతుండటంతో సంబంధిత ఇన్స్టాగ్రామ్ పేజీపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇన్స్టాగ్రామ్లో దాదాపు 15,000 మంది ఫాలోవర్లను కలిగి ఉన్న jamunda_2 పేజీ.. నిర్దిష్ట వ్యక్తులను, ప్రత్యేకంగా యువతులను లక్ష్యంగా చేసుకునే వీడియోలను షేర్ చేస్తుంది. ఇది వారి వీడియోలను అవమానకరమైన ట్యాగ్లు, శీర్షికలతో పోస్ట్ చేస్తోంది.

అలాంటి వీడియోలను షూట్ చేయమని పేజీ.. ప్రజలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. 900 మంది వ్యక్తులు అలాంటి వీడియోలను చిత్రీకరించారని, వాటిని ఈ ఖాతాలో అప్లోడ్ చేశారని తెలిసింది.
ఈ క్రమంలో పోలీసులు ఐపీసీ సెక్షన్లు 506 (క్రిమినల్ బెదిరింపు), 509 (మహిళలను అవమానించడం), 354 (డి) (వెంబడించడం), ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.
పేజీ నిర్వాహకులకు సంబంధించిన పూర్తి డేటాను అందించాలని పోలీసులు ఇన్స్టాగ్రామ్కు కూడా లేఖ రాశారు.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications