'హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసిందే టిఆర్ఎస్, అభద్రతకు కెసిఆరే కారణం'
హైదరాబాద్: నగరంలోని ఇతర ప్రాంతాల వారిని దుర్భాషాలాడి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసింది అధికార టిఆర్ఎస్ పార్టీ నేతలేనని కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం మండిపడ్డారు. మీట్ ది ప్రెస్లో ఆయన మాట్లాడారు. హైదరాబాదులో అభద్రతకు కారణం తెరాస నేతలే అన్నారు.
సోనియా గాంధీ వల్లే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు తెరాస ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్పారు. హైదరాబాదుకు ఈ గుర్తింపు కాంగ్రెస్ పార్టీ చలవే అన్నారు. హైదరాబాదులో ఫార్మా రంగం, పరిశ్రమల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ముందుచూపు వల్లే అన్నారు.
గ్రేటర్ ఎన్నికలకు తెరాస భయపడిందని మండిపడ్డారు. ఎన్నికల్లో అక్రమాలకు తెరలేపుతోందన్నారు. ఎన్నికల సంఘం తీరు పైనా తమకు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ప్రచారంలో అందరికీ సమాన అవకాశాలు కల్పించలేదని, ముందుగానే తెరాస హోర్డింగులు పెట్టుకుందన్నారు.

10 నెలల కాలంలో తెరాస చేసింది ప్రచారం ఆర్భాటం తప్ప ఏమీ లేదన్నారు. గ్రేటర్ హైదరాబాద్ను ఏర్పాటు చేసిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఎన్నికల్లో అక్రమాల ద్వారా గెలవాలని కెసిఆర్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, అందుకే అక్రమాలకు పాల్పడుతోందని, వార్డుల విభజన ఏకపక్షంగా చేసిందన్నారు.
మెట్రో రైలు నిర్మాణం ఎప్పుడో పూర్తి కావాలని, కానీ ప్రభుత్వం అర్థరహిత నిర్ణయాలతో ఇంకా అది పూర్తి కాలేదన్నారు. ఇతర ప్రాంతాల వారిని దుర్భాషాలాడి హైదరాబాద్ బ్రాండ్ను దెబ్బకొట్టింది తెరాస నాయకులు కాదా అని ప్రశ్నించారు. ఇతర ప్రాంతాల ప్రజల అభద్రతా భావానికి అధికార పార్టీ నేతలే కారణమన్నారు.
కోర్టు మొట్టికాయలు వేస్తే గానీ అధికార పార్టీకి గ్రేటర్ ఎన్నికలు గుర్తుకు రాలేదన్నారు. కెసిఆర్ చివరకి హైదరాబాద్ ప్రజలను కూడా మోసం చేసేందుకు సిద్ధమయ్యారన్నారు. ఎన్నికల హామీలను మర్చిపోయి కొత్త హామీలు గుప్పించడం విడ్డూరమన్నారు.

ఫీజు రీయింబర్సుమెంట్స్ తీసుకు వచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని, దానిని నాశనం చేసింది కెసిఆర్ అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ.. తదితరాల మాట ఏమిటన్నారు. నియోజకవర్గానికి కేవలం నాలుగు వందల ఇళ్లు ఇచ్చి తెరాస ఎంతో ప్రచారం చేసుకుంటోందన్నారు.
విద్యార్థులు బోధనా రుసుముల కోసం నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. దళితులకు మూడెకరాల భూమి, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ఏమయ్యాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ పక్కా ఇళ్లు కట్టించిన విషయం ప్రజలు మర్చిపోలేదన్నారు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications