Amberpet flyover: నెరవేరిన దశాబ్దాల కల, వాహనాలు రయ్ రయ్!
హైదరాబాద్ నగరంలోని అంబర్పేట్ వైపు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త అందింది. పనులు పూర్తి కావడంతో ఫ్లైఓవర్పై బుధవారం రాకపోకలు ప్రారంభమయ్యాయి. స్థానిక పార్లమెంటు సభ్యుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలతో అధికారులు వాహనాల రాకపోకలను అనుమతించారు. దీంతో శివరాత్రి రోజు నుంచే రాకపోకలు కొనసాగుతున్నాయి.
కాగా, అంబర్పేట్ ఫ్లైఓవర్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. కింద భాగాన రోడ్డు నిర్మాణం, గ్రీనరీ, సుందరీకరణ పనులు పూర్తి చేసి అధికారికంగా మరికొన్ని రోజుల్లో ఫ్లైఓవర్ ప్రారంభించనున్నారు. అప్పటి వరకు ప్రయాణికుల సౌకర్యార్థం మహా శివరాత్రి నుంచి ఈ ఫ్లైఓవర్పై రాకపోకలకు అనుమతించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

మంగళవారం నాడే ఆయన ఫ్లైఓవర్ పనులను కిషన్ రెడ్డి పర్యవేక్షించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలతో బుధవారం నుంచి అంబర్పేట్ ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. చాలా కాలంగా ఫ్లై ఓవర్ ఎప్పుడు ప్రారంభమవుతుందా? అని ఈ ప్రాంతం ప్రజలు ఎదురుచూస్తున్నారు. దశాబ్దాల కల నెరవేరడంతో ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
The 𝐀𝐦𝐛𝐞𝐫𝐩𝐞𝐭 𝐅𝐥𝐲𝐨𝐯𝐞𝐫 will be operational from tomorrow, providing great relief to commuters from traffic congestion and smooth highway travel.
— G Kishan Reddy (@kishanreddybjp) February 25, 2025
Sharing glimpses from my inspection of the flyover, from today morning, alongside officials of NHAI, GHMC and other… pic.twitter.com/VzQn5RUnWn
'భారత ప్రభుత్వం మద్దతుతో రూ. 338 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ ఫ్లైఓవర్, రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ అడ్డంకుల కారణంగా దశాబ్దాలుగా జాప్యం తర్వాత నేటి నుంచి పనిచేయనుంది. ఈ కీలకమైన ప్రాజెక్ట్ వరంగల్, ఖమ్మం మధ్య నివాసితులు, ప్రయాణికులు ఎదుర్కొంటున్న తీవ్రమైన ట్రాఫిక్ రద్దీని పరిష్కరిస్తుంది, ఇది చాలా అవసరమైన ఉపశమనాన్ని అందిస్తుంది' అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications