కాకినాడలో కాంగ్రేస్ నేత వీహెచ్ ధర్నా , !
హైద్రబాద్ లో రాజ్యంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమానలు ఆంధ్ర ప్రజల కూడ తెలియచేసేందుకు కాంగ్రేస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు కాకినాడలో ధర్నా చేయనున్నట్టు తెలిపారు. హైద్రబాద్ , పంజాగుట్ట సర్కిల్ వద్ద స్థాపించాలనుకున్న అంబేద్కర్ విగ్రహం డంప్ యార్డ్ కు చేరిన విషయం తెలిసిందే,

దీంతో పలు దళిత సంఘాలు , రాజకీయ పార్టీలు ఆందోళనలు చేపట్టారు .కాగా ఇదే అంశంపై ఆందోళన చేస్తున్న పలు దళిత నేతలను సైతం తెలంగాణ ప్రభుత్వం హౌస్ అరెస్ట్ చేసింది. దీంతో తెలంగాణలో బాద్యులను శిక్షించేందుకు ఆందోళనలు ఉదృతం చేస్తున్నాయి పార్టీలు . ఈనేపథ్యంలోనే వి.హనుమంతరావు ఇదే విషయంపై ఆంధ్ర ప్రదేశ్ లో కూడ ఆందోళన కొనసాగించాలని భావించారు. దీంతో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి ఇంద్రపాలెం బ్రిడ్జి వద్ద ఉన్న అంబెద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేయనున్నట్టు ప్రకటించారు. దీని ద్వార ఆంధ్రప్రదేశ్ లో దళితులు,బీసీ లను కూడ అందోళనను ఉదృతం చేస్తానని చెప్పారు.
కాగా వీహెచ్ ఇదే విషయంలో స్వంత పార్టీ అధినేత తెలంగాన రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కూడ తీవ్ర విమర్శలు చేశారు. అంబేద్కర్ విగ్రహం ధ్వంసం అయితే ఆయన ఉత్తమ్ పట్టించుకోవడం లేదని ఆయన రాజకీయాల మీదే ఎక్కువగా దృష్టి పెడుతున్నారని మండిపడ్డారు.ఎస్సీ ,బీసీ ఓట్లు కావాలి కాని వారి సమస్యలు పట్టవా అంటూ తీవ్రంగా దుయ్యబట్టారు .దీంతో ఉత్తమ్ సైతం అంబేద్కర్ విగ్రహ ధ్వంసం ఘటనను తీవ్రంగా ఖండించాల్సి వచ్చింది.
-
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications