పరకాలలో పాగా వేసేది ఎవరు..! కొండ సురేఖ ఎంట్రీతో రసవత్తరం కానున్న పోటీ..!!
హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికలను ఆపథర్మ సీయం చంద్రశేఖర్ రావు ఏ ముహూర్తంలో కుదిర్చారో తెలియదు గాని రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కొన్ని నియోజక వర్గాల్లో సొంతపోరు తారా స్థాయిలో నడుస్తుంటే కొన్ని నియోజక వర్గాల్లో త్రిముఖపోరు నెలకొంది. తాజాగా పరకాల నియోజక వర్గంలో రాజకీయ సమీకరణాలు శర వేగంగా మారుతున్నాయి. మొన్నటి వరకూ ఏకపక్షమనుకున్న పరకాల ఎన్నిక కొండా సురేఖ ఎంట్రీతో త్రిముఖ పోరులా మారింది.టీడిపి, టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ పార్టీల మద్య ఆసక్తికర పోరు జరగబోతోంది. 2014 లో ఉంత్కంఠ పరిస్థితుల మద్య తెలుగుదేశం పార్టీ తరుపున విజయం సాదించిన చల్లా ధర్మారెడ్డి కి ఈ సారి కొండా సురేఖ రూపంలో కష్టాలు ఎదురౌతున్నాయి. సురేఖ పరాకాల నుండి పోటీ చేస్తానని చేసిన ప్రకటన తో ఒక్కసారి ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి.

పరాకాలలో రాజకీయ టెన్షన్..! కొండా సురేఖ ఎంట్రీతో చెలరేగిన ఉత్కంఠ..!!
రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కొండా సురేఖ పనిచేస్తున్నారని సమాచారం. కొండా దంపతుల రాకతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అయిందని కాంగ్రెస్ వర్గాలు ఆశా భావం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు చల్లా వరుసగా రెండు ఎన్నికల్లో ఓటమి ఎదురైనా కుంగిపోలేదు. తెలంగాణ ఆవిర్భవించాక చాలామంది నేతలు టీఆర్ ఎస్ లోకి జంప్ అయినా ఆయన మాత్రం మారలేదు. టీడీపీలోనే కొనసాగారు. పట్టుదలతో పనిచేశారు. పార్టీ క్యాడర్ ను కాపాడుకున్నారు. ఆ పార్టీ టికెట్ పైనే పోటీ చేశారు. బలమైన సెంటిమెంట్ ను తోసిరాజని మరీ 2014 ఎన్నికల్లో గెలుపు బావుటా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఎగరేశారు. ఎన్నికల అనంతరం తప్పనిసరి పరిస్థితుల్లో చల్లా టీఆర్ ఎస్ లో చేరారు.

గెలుపుపై చల్లగా ఉన్న చల్లా ధర్మారెడ్డి..! కొండా దంపతుల రాకతో అయోమయంలో గులాబీ దళం..!!
అధికార పార్టీ అందించిన అండతో తన నియోజకవర్గంలో మంచి అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రజాభిమానాలను మరింతగా చూరగొన్నారు. దీంతో ఈ దఫా కూడా పరకాల నుంచి ఆయనే టీఆర్ ఎస్ తరపున బరిలో దిగుతారని ప్రజలు విశ్వసించారు. వారి నమ్మకాన్ని అధికార పార్టీ వమ్ము చేయలేదు. చల్లా విజయంపై ఎలాంటి అనుమానం లేకపోవడంతో తిరిగి టికెట్ ను ఆయనకే కేటాయించింది. పరకాలలో ఆయన్ను ఢీకొట్టే అభ్యర్థులెవరూ ప్రత్యర్థి పార్టీల్లో లేరని అంచనా వేసింది. ఇక్కడే అనూహ్య మలుపు. గత ఎన్నికల సమయంలో టీఆర్ ఎస్ లో ఉన్న కొండా దంపతులు ఇప్పుడు సొంతగూడు కాంగ్రెస్ కు చేరుకున్నారు. టీఆర్ ఎస్ పై యుద్ధం ప్రకటించారు.

సురేఖ సొంత నియోజకవర్గం పరకాలే..! సులభంగా గెలవాలే..!!
పరకాలలో తాను స్వయంగా బరిలో దిగనున్నట్లు కొండా సురేఖ తాజాగా ప్రకటన కూడా చేశారు. దీంతో ఒక్కసారిగా పరకాలలో రాజకీయం వేడెక్కింది. టీఆర్ ఎస్ కు ప్రతికూల పవనాలు మొదలయ్యాయి.వాస్తవానికి పరకాల టికెట్ ను కాంగ్రెస్ నుంచి ఇనగాల వెంకట్రామిరెడ్డి - అవేలి దామోదర్ ఆశించారు. వారిద్దరిలో ఎవరు పోటీ చేసినా చల్లాకు విజయం అంత కష్టం కాకపోయి ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొండా రాకతో పరకాల రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షిస్తోందని చెబుతున్నారు. వాస్తవానికి కొండా సురేఖ సొంత నియోజకవర్గం పరకాలే. గత ఎన్నికల్లో టీఆర్ ఎస్ తరపున వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఆమె గెలుపొందినప్పటికీ, అంతకుముందు పరకాల ఎమ్మెల్యేగానే పనిచేశారు.

పరకాలలో హోరాహోరీ తప్పదు..! చల్లాకు చుక్కలే అంటున్న కొండా వర్గం..!!
నియోజకవర్గంలోని పరకాల - గీసుగొండ - ఆత్మకూరు - సంగెం మండలాల్లో కొండా కుటుంబానికి మంచి పట్టుంది. కొండా వరంగల్ తూర్పుకు వెళ్లిపోయాక వారి అనుచరగణం తప్పనిసరి పరిస్థితుల్లో టీఆర్ ఎస్ లోకి వెళ్లింది. ఇప్పుడు కొండా తిరిగి రావడంతో పరిస్థితులు మారుతున్నాయి. పాత మిత్రులు - అనుచరగణం తిరిగి కొండాతో కలుస్తున్నారు. ఇక సురేఖను పరకాల నియోజకవర్గంలో చాలామంది మహిళలు తమ ఇంటి ఆడపడుచుగా చూస్తుంటారు. ఆ కోణంలోనూ చల్లాపై కొండాకు బలం ఉంది. ధనబలంలోనూ కొండాకు సాటిలేదు. కాబట్టి ఈ సారి పరకాలలో హోరాహోరీ తప్పదని, చల్లా గెలుపు అంత సులువు కాదని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications