28న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం మూసివేత: ఎందుకంటే?
హైదరాబాద్: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అక్టోబర్ 28న మూసివేయనున్నారు. చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేయనున్నారు. అక్టోబర్ 28న సాయంత్రం నాలుగు గంటల నుంచి 29వ తేదీ ఉదయం వరకు ఆలయాన్ని మూసివేస్తారు.
చంద్ర గహణానికి ముందు రోజు అంటే అక్టోబర్ 27వ తేదీ రాత్రి 7 గంటలకు శరత్ పౌర్ణమి వేడుకలను బ్రహ్మోత్సవ కళ్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. చంద్రగ్రహణం సందర్భంగా 28వ తేదీన సాయంత్రం 4 గంటలకు ఆలయాన్ని మూసివేసి.. తిరిగి 29వ తేదీ తెల్లవారుజామున 5 గంటలకు తెరిచి సంప్రోక్షణ చేస్తామని ఆలయ ప్రధాన అర్చకులు నందింగల్ లక్ష్మీనరసింహచార్యులు తెలిపారు.

చంద్ర గ్రహణం సందర్భంగా యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి వారి ప్రధానాలయంతోపాటు అనుబంధ ఆలయాలైన శ్రీపర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయం, పాతగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయాలను కూడా మూసివేయనున్నారు.
అశ్వయుజ మాసం పౌర్ణమి రోజున చంద్రగ్రహణం సంభవిస్తుందని.. 2.22 గంటల వరకు ఉంటుందని అర్చకులు తెలిపారు. గంటా 16 నిమిషాలపాటు గ్రహణ సమయం ఉంటుందని.. దీన్ని అంశిక గ్రహణంగా పిలుస్తారని ఆయన తెలిపారు. 2023లో భారతదేశంలో కనిపించే ఏకౌక చంద్ర గ్రహణం ఇదే కావడం గమనార్హం. చంద్ర గ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ఆలయాలు కూడా మూసివేయనున్నారు. శ్రీకాళహస్తి మినహా అన్ని ఆలయాలు అక్టోబర్ 28న మూసివేసే అవకాశం ఉంది. గ్రహణం పట్టని ఆలయంగా శ్రీకాళహస్తి ప్రసద్ధి చెందిన విషయం తెలిసిందే.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications