ఏడుపాయల మహాజాతరకు వేళాయే.. తేదీలు ఇవే..
మెదక్ జిల్లాలోని వనదుర్గమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. మంజీరా నది తీరాన ఏడుపాయల దుర్గా భవాని ఆలయం కొలువై ఉంది. ఏటా మహా శివరాత్రి పర్వదినాన నిర్వహించే ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా విశేష సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇక మరో వారం రోజుల్లో జాతర స్టార్ట్ కానుంది. 3 రోజులు పాటు కనులపండువగా జరిగే జాతరకు సర్వం సిద్ధం చేస్తున్నారు అధికారులు.
ఏడుపాయల దుర్గా భవాని జాతర తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరిగే రెండో అతిపెద్ద జాతర. రాష్ట్రంలో మేడారం, పెద్ద గట్టు జాతర తర్వాత ఆ స్థాయిలో ప్రాచుర్యం పొందింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 15- 17 వరకు మూడు రోజుల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం , ఆలయ కమిటీ సమాయత్తం అవుతోంది.
ఈ జాతర ఏటా మూడు రోజుల పాటు జరుగుతుంది. జాతరలో భాగంగా మొదటి రోజు మహాశివరాత్రి సందర్భంగా భక్తులు మంజీరా నదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తారు. దుర్గా భవానిని దర్శించుకుంటారు. ఇక రెండో రోజు ప్రధాన ఘట్టమైన బండ్ల ఉత్సవం అత్యంత కోలాహలంగా సాగుతుంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తమ ఎడ్ల బండ్లను రంగురంగుల పూలతో.. లైట్లతో అలంకరిస్తారు. ఇక ఆఖరి రోజు రథోత్సవంతో ఈ మహా క్రతువు ముగుస్తుంది.

ఈ జాతరకు ఆ పేరు ఎలా వచ్చిందంటే..? మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్ సాన్ పల్లి వద్ద మంజీరా నది ఏడు పాయలుగా విడిపోయి ప్రవహిస్తుంది. వేద కాలం నాటి పురాణాల ప్రకారం, జనమేజయుడు చేసిన సర్పయాగ ఫలాన్ని స్వీకరించడానికి సప్తర్షులు ఏడు పాయలుగా మారి ఇక్కడ ప్రవహించారని భక్తుల నమ్మకం. అందుకే దీనికి 'ఏడుపాయలు' అనే పేరు వచ్చింది. ఇక ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రల నుండి కూడా దాదాపు 15 లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications