Chandrayaan 3: చందమామపై శాశ్వత ముద్ర- రోవర్ వీల్పై మూడు సింహాల లోగో
తిరుపతి: భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో.. మరో ఘనతను సాధించింది. చంద్రయాన్ 3 రాకెట్ను నింగిలోకి పంపించింది. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన సంస్థ నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగివైపు దూసుకెళ్లింది ఈ రాకెట్. 2019లో చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమైన నేపథ్యంలో- ఈ మూన్ మిషన్ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది ఇస్రో.
లాంచ్ ప్యాడ్ నుంచి దూసుకెళ్లిన కొద్దిసేపటికే ఈ ప్రయోగం విజయవంతమైంది. రాకెట్ నుంచి చంద్రయాన్ 3 శాటిలైట్ విడిపోయింది. చంద్రయాన్-3లో ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్ ఉన్నాయి. దీని బరువు దాదాపు 3,900 కేజీలు. చంద్రుడి కక్ష్య నుంచి భూమి స్పెక్ట్రల్- పోలారిమెట్రిక్ కొలతలను అధ్యయనం చేయడానికి స్పెక్ట్రో-పోలరిమెట్రీ ఆఫ్ హాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ (షేప్) పేలోడ్ను ఈ రాకెట్తో పాటు పంపించారు.

చంద్రయాన్ 3 మిషన్.. ల్యాండింగ్ తేదీ వెలువడింది. ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్.. ఈ విషయాన్ని ప్రకటించారు. ఆగస్టు 23వ తేదీన సరిగ్గా సాయంత్రం 5 గంటల 47 నిమిషాలకు చంద్రయాన్ 3 జాబిల్లి మీద అడుగుపెడుతుంది. దీనికోసం చంద్రుడి దక్షిణ ధృవాన్ని ఎంచుకున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్ 3 ఉపగ్రహం 42 రోజుల పాటు అంతరిక్ష ప్రయాణం సాగిస్తుంది.
ప్రస్తుతం భూకక్ష్యలో ప్రరిభ్రమిస్తోన్న ఈ శాటిలైట్.. క్రమంగా చందమామ ఆర్బిట్లోకి ప్రవేశిస్తుంది. అనుకున్నది అనుకున్నట్లుగా.. అన్నీ సవ్యంగా సాగితే- ఆగస్టు 23వ తేదీన సాయంత్రం 5:47 నిమిషాలకు చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్ 3 ల్యాండర్.. దిగుతుంది. ఆ వెంటనే రోవర్- జాబిల్లి ఉపరితలంపై కాలు మోపుతుందని సోమనాథ్ తెలిపారు.
On the last wheel of Pragyan, ISRO logo can be seen embossed - a clear visual confirmation that similar to CY-2, this rover too shall leave behind imprints on the regolith.
— Astro_Neel (@Astro_Neel) July 13, 2023
Only this time, the logo and State Emblem of India's location seem to have been swapped on the rear… pic.twitter.com/5LRGWtrTAW
కాగా- చందమామ ఉపరితలంపై శాశ్వత ముద్ర వేయబోతోంది భారత్. చంద్రయాన్ 3 శాటిలైట్ మోసుకెళ్లిన ప్రజ్ఞాన్ రోవర్ వీల్పై మూడు సింహాలు, ఇస్రో లోగోను ముద్రించడమే దీనికి కారణం. జాబిల్లిపై దిగిన తరువాత అది సంచరిస్తున్నప్పుడు మూడు సింహాలు, ఇస్రో లోగో జాడలు అక్కడి మట్టిపై పడతాయి. అవి శాశ్వతంగా నిలిచిపోతాయి.
ఆ ఉద్దేశంతోనే రోవర్లోని చివరి రెండు వీల్స్లల్లో ఒకదానిపై మూడు సింహాలు, మరో దానిపై ఇస్రో లోగోను ముద్రించినట్లు తెలుస్తోంది. 2019లో ప్రయోగించిన చంద్రయాన్ 2లో వినియోగించిన రోవర్ వీల్స్ పైనా అవే లోగోలను ముద్రించినప్పటికీ.. అది సాధ్యపడలేదు. ఆ ప్రయోగం విఫలమైంది.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications