ఆ మహిళకు 18 మంది భర్తలా ? తిరుపతిలో ఎమ్మెల్సీ దొంగ ఓట్లపై సీపీఐ నారాయణ ఫైర్
ఏపీలో పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా భారీ ఎత్తున అధికార పార్టీ దొంగఓట్లు నమోదు చేయిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
తిరుపతి : ఏపీలో జరుగుతున్న పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార వైసీపీతో పాటు విపక్షాలకూ ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇందులో ఆయా పార్టీల అభ్యర్ధుల గెలుపోటములు వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అన్ని పార్టీలు వీటిని సీరియస్ గా తీసుకున్నాయి. ఇదే క్రమంలో అధికార వైసీపీ దొంగఓట్లు నమోదు చేయించి ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని సీపీఐ జాతీయనేత నారాయణ ( CPI Narayana ) మండిపడ్డారు.
తిరుపతిలో వైసీపీ నేతలు దొంగఓట్లు నమోదు చేయించినట్లు ఆరోపణలు వచ్చిన ఇళ్లను తాజాగా సీపీఐ నారాయణ సందర్శించారు. అక్కడ ఓట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నారాయణ వైసీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాభారతంలో ద్రౌపదికి ఐదుగురు భర్తలని విన్నాం కానీ జగన్రెడ్డి ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కేబీ లేఅవుట్లోని ఓ మహిళకు 18 మంది భర్తలున్నట్లు నమోదు చేయడం సిగ్గు చేటని నారాయణ విమర్శించారు. దొంగ ఓట్ల కోసం వైసీపీ నేతలు ఇలా చూపడం సిగ్గుచేటన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తిరుపతిలోని కొన్ని డివిజన్లలో నారాయణ పర్యటించారు. ఓ ఇంట్లో 30, మరో నివాసంలో 11 ఓట్లు నమోదు చేసుండటాన్ని నారాయణ గుర్తించారు. యశోదనగర్ 18-1-90/12జి ఖాళీ ప్రదేశంలో పది దొంగ ఓట్లున్నట్లు తెలుసుకున్నారు. ఒకటో క్రాస్ వలంటీర్ ఇంట్లో 12 ఓట్లు ఉన్నట్లు గుర్తించారు. సీపీఎం ఆఫీసు పక్కన లక్ష్మి ఇంట్లో ఎనిమిది దొంగ ఓట్లు ఉన్నట్లు గుర్తించారు. ఓటమి భయంతోనే ఏ చదువూ లేనివారికీ వైసీపీ ప్రభుత్వం గ్రాడ్యుయేట్ ఓటు అర్హత కల్పించడం దారుణమని నారాయణ విమర్శించారు.
తిరుపతి నగరంలోనే ఏడువేల దొంగ ఓట్లున్నట్లు తెలిపారు. దొంగ ఓట్ల నమోదుకు సహకరించిన అధికారిని ఉరితీయాలన్నారు. టీటీడీ చైర్మన్గా పనిచేసిన ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నియోజకవర్గంలో దొంగ ఓట్ల దందా కొనసాగుతుండడం దుర్గార్మమని నారాయణ తెలిపారు. దొంగ ఓట్ల సాయంతో గెలిచేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. దొంగ ఓట్లు వేయడానికి వచ్చినవారి కాళ్లు విరగ్గొట్టాలన్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా పీడీఎఫ్ అభ్యర్థుల విజయం తథ్యమని నారాయణ జోస్యం చెప్పారు. దొంగ ఓట్ల జాబితా, అర్హత కలిగినా ఓటు హక్కు కల్పించకపోవడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications