వాతావరణ మార్పులను పసిగట్టేలా
ISRO: భారత అంతరిక్ష పరిశోన సంస్థ.. ఇస్రో మరో కీలక ప్రాజెక్ట్ను చేపట్టింది. వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు పసిగట్టడానికి ఉద్దేశించిన ఇన్సాట్-3డీఎస్ను అంతరిక్షంలోకి ప్రయోగించనుంది. ఈ సాయంత్రం తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.
ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లబోతోంది. ఈ సాయంత్రం సరిగ్గా 5:35 నిమిషాలకు రాకెట్ ప్రయోగించనుంది ఇస్రో. దీనికి అవసరమైన కౌంట్డౌన్ను ఇదివరకే చేపట్టింది. వాతావరణంలో చోటు చేసుకుంటోన్న మార్పులపై ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి ఈ ప్రయోగాన్ని చేపట్టింది.

ఇన్సాట్- 3డీఎస్ ఉపగ్రహం బరువు 2,274 కేజీలు. 10 సంవత్సరాల పాటు ఇది అంతరిక్షం నుంచి సేవలను అందిస్తుంది. ఇదివరకు 2013లో ప్రయోగించిన ఇన్సాట్-3డీ, 2016లో పంపించిన ఇన్సాట్-3డీఆర్ కాల పరిమితి ముగిసిన నేపథ్యంలో ఇప్పుడీ 3డీఎస్ సేవలు అవసరం అయ్యాయి.
ఈ ఉపగ్రహానికి నాటీ బాయ్ అని పేరు పెట్టింది ఇస్రో. ప్రయోగించిన 18 నిమిషాల వ్యవధిలో ఈ రాకెట్ కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. ఇస్రో చరిత్రలో ఇది 16వ ప్రయోగం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పూర్తి స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్తో ఈ రాకెట్ను రూపొందించారు ఇస్రో శాస్త్రవేత్తలు.
భూ, సముద్ర ఉపరితలాలపై ఏర్పడే వాతావరణ పరిస్థితులపై అధునాతన పద్ధతుల్లో అధ్యయనం చేస్తుంది ఈ శాటిలైట్. వాటి డేటాను గ్రౌండ్ స్టేషన్కు చేరవేస్తుంది. దీన్ని విశ్లేషించడం వల్ల ప్రకృతి వైపరీత్యాల గురించి ముందే తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications