తిరుమలలో కొత్త సంవత్సరం శోభ
తిరుమల : కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ శ్రీవారి సన్నిధి ముస్తాబైంది. న్యూ ఇయర్ తొలిరోజు ఏడుకొండలవాడి ఆశీస్సుల కోసం భక్తులు తిరుమలకు చేరుకున్నారు. ఈక్రమంలో దేవస్థానం అలంకరణ శ్రీనివాసుడి భక్తులకు కనువిందు చేస్తోంది. ధ్వజస్తంభం, ఆలయ ప్రాకారం ఇలా ఆలయం మొత్తం విద్యుద్దీపాలతో, కలర్ ఫుల్ ఫ్లవర్స్ తో అలంకరించారు టీటీడీ అధికారులు.

కొత్త సంవత్సరం వేళ స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్నీ చర్యలు తీసుకున్నారు టీటీడీ అధికారులు. సోమవారంతో పాటు మంగళవారం నాడు కూడా ఆర్జిత సేవలు రద్దు చేశారు. మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటల నుంచే వీఐపీ బ్రేక్ దర్శనం ప్రారంభించారు. తెల్లవారుజాము 4.30 గంటల నుంచి సామాన్య భక్తులకు ధర్మదర్శనానికి అవకాశం కల్పించారు. ఇది మంగళవారం అర్ధరాత్రి వరకు కొనసాగనుంది.












Click it and Unblock the Notifications