వారి చేత బాబు తిట్టిస్తున్నారు.. శునకానందం పొందుతున్నారు: సాయిరెడ్డి
చంద్రబాబు నాయడుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ఆయన బాధ్యత గల ప్రతిపక్ష నేతగా వ్యవహరించడం లేదని చెప్పారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిపైకి తన పార్టీ నేతలను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు, టీడీపీ, ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్పైకి చంద్రబాబు తన పార్టీ నేతల చేత తొడలు కొట్టిస్తున్నారని ఆరోపించారు.
జగన్ను బూతులు తిట్టిస్తూ చంద్రబాబు శునకానందం పొందుతున్నారని సాయిరెడ్డి విమర్శించారు. టీడీపీ అంటే తొడల దేహం పార్టీ అని అభివర్ణించారు. సీబీఎన్ అంటే చంద్ర బూతుల నాయుడు అని అనుకోవాల్సి వస్తోందని హాట్ కామెంట్స్ చేశారు. టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడిని తాగుబోతుగా అభివర్ణించారు. ఇదీ అందరికీ తెలుసు అని చెప్పారు.
టీడీపీ ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న పార్టీ కాదని సాయిరెడ్డి ఆరోపించారు. జగన్పై బూతులు తిట్టించడాన్ని టీడీపీ నేతలకు చంద్రబాబే నేర్పించారని ఆరోపించారు. దీంతో చంద్రబాబు ఓ బాధ్యత కలిగిన విపక్ష నేతగా వ్యవహరించడం లేదని కామెంట్స్ చేశారు. దిగజారి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అందుకే టీడీపీ నేతలు అలా ప్రవర్తిస్తున్నారని ఫైరయ్యారు.
ఏపీలో అప్పుడే ఎన్నికల హీట్ నెలకొంది. అధికార, విపక్షాల డైలాగ్ వార్ పెరిగింది. విమర్శలు, ప్రతీ విమర్శలతో హోరెత్తిస్తున్నారు. అందులో భాగంగా సీఎం జగన్పై కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై విజయసాయి రెడ్డి స్పందించారు. మిగతా నేతలు కూడా టీడీపీకి గట్టి కౌంటర్ ఇచ్చారు.