vijayawada murder : మహిళ కోసం గొడవ- పక్కాప్లాన్తో కిరాతకంగా హత్య
ఇవాళ మధ్యాహ్నం విజయవాడలోని దుర్గా అగ్రహారంలో జరిగిన దారుణ హత్య దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. పట్టపగలు నడిరోడ్డుపై కత్తులతో ఓ వ్యక్తిని దారుణంగా పొడిచి చంపిన ఘటనపై సీసీటీవీ ఫుటేజ్తో పాటు ఇతర ఆధారాల సాయంతో దర్యాప్తు జరుపుతున్న నగర పోలీసులు నిందితులను గుర్తించారు.
విజయవాడ దుర్గా అగ్రహారంలో వ్యక్తి దారుణ హత్యకు ఓ మహిళ కారణమని పోలీసులు గుర్తించారు. ఆ మహిళ విషయంలో జరిగిన గొడవలే అంతిమంగా అతన్ని కిరాతకంగా హతమార్చేందుకు కారణమైనట్లు వారు తేల్చారు. ఓ మహిళ విషయంలో కొంతకాలంగా ఇద్దరి మధ్య వివాదం జరుగుతున్నట్లు తెలిసింది. దీంతో ఇందులో ఒకరిని మరో వ్యక్తి, అతని స్నేహితులు కలిసి హతమార్చినట్లు తెలుస్తోంది. పక్కా ప్లాన్ ప్రకారమే ఈ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.
విజయవాడలోని కండ్రిగకు చెందిన రౌడీ షీటర్ కుక్కల రవి, హేమంత్, కరీం అనే వ్యక్తులు ఈ దారుణ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో ఒకరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. విచారణలో మహిళకు సంబంధించిన వివాదమే హత్యకు కారణంగా తేల్చారు. దీంతో మిగతా నిందితుల్ని కూడా పట్టుకునేందుకు గాలింపు కొనసాగుతోంది. ఇవాళ నగరంలో పట్టపగలు జరిగిన ఈ హత్యతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సాయంత్రానికి దర్యాప్తులో పురోగతి సాధించారు.