విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

vijayawada murder : మహిళ కోసం గొడవ- పక్కాప్లాన్‌తో కిరాతకంగా హత్య

|
Google Oneindia TeluguNews

ఇవాళ మధ్యాహ్నం విజయవాడలోని దుర్గా అగ్రహారంలో జరిగిన దారుణ హత్య దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. పట్టపగలు నడిరోడ్డుపై కత్తులతో ఓ వ్యక్తిని దారుణంగా పొడిచి చంపిన ఘటనపై సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు ఇతర ఆధారాల సాయంతో దర్యాప్తు జరుపుతున్న నగర పోలీసులు నిందితులను గుర్తించారు.

విజయవాడ దుర్గా అగ్రహారంలో వ్యక్తి దారుణ హత్యకు ఓ మహిళ కారణమని పోలీసులు గుర్తించారు. ఆ మహిళ విషయంలో జరిగిన గొడవలే అంతిమంగా అతన్ని కిరాతకంగా హతమార్చేందుకు కారణమైనట్లు వారు తేల్చారు. ఓ మహిళ విషయంలో కొంతకాలంగా ఇద్దరి మధ్య వివాదం జరుగుతున్నట్లు తెలిసింది. దీంతో ఇందులో ఒకరిని మరో వ్యక్తి, అతని స్నేహితులు కలిసి హతమార్చినట్లు తెలుస్తోంది. పక్కా ప్లాన్‌ ప్రకారమే ఈ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.

dispute for women behind vijayawada durga agraharam murder

విజయవాడలోని కండ్రిగకు చెందిన రౌడీ షీటర్ కుక్కల రవి, హేమంత్‌, కరీం అనే వ్యక్తులు ఈ దారుణ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో ఒకరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. విచారణలో మహిళకు సంబంధించిన వివాదమే హత్యకు కారణంగా తేల్చారు. దీంతో మిగతా నిందితుల్ని కూడా పట్టుకునేందుకు గాలింపు కొనసాగుతోంది. ఇవాళ నగరంలో పట్టపగలు జరిగిన ఈ హత్యతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సాయంత్రానికి దర్యాప్తులో పురోగతి సాధించారు.

English summary
vijayawada police has traced out the reason behind today's murder in durga agraharam area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X