vijayawada murder : మహిళ కోసం గొడవ- పక్కాప్లాన్తో కిరాతకంగా హత్య
ఇవాళ మధ్యాహ్నం విజయవాడలోని దుర్గా అగ్రహారంలో జరిగిన దారుణ హత్య దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. పట్టపగలు నడిరోడ్డుపై కత్తులతో ఓ వ్యక్తిని దారుణంగా పొడిచి చంపిన ఘటనపై సీసీటీవీ ఫుటేజ్తో పాటు ఇతర ఆధారాల సాయంతో దర్యాప్తు జరుపుతున్న నగర పోలీసులు నిందితులను గుర్తించారు.
విజయవాడ దుర్గా అగ్రహారంలో వ్యక్తి దారుణ హత్యకు ఓ మహిళ కారణమని పోలీసులు గుర్తించారు. ఆ మహిళ విషయంలో జరిగిన గొడవలే అంతిమంగా అతన్ని కిరాతకంగా హతమార్చేందుకు కారణమైనట్లు వారు తేల్చారు. ఓ మహిళ విషయంలో కొంతకాలంగా ఇద్దరి మధ్య వివాదం జరుగుతున్నట్లు తెలిసింది. దీంతో ఇందులో ఒకరిని మరో వ్యక్తి, అతని స్నేహితులు కలిసి హతమార్చినట్లు తెలుస్తోంది. పక్కా ప్లాన్ ప్రకారమే ఈ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.

విజయవాడలోని కండ్రిగకు చెందిన రౌడీ షీటర్ కుక్కల రవి, హేమంత్, కరీం అనే వ్యక్తులు ఈ దారుణ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో ఒకరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. విచారణలో మహిళకు సంబంధించిన వివాదమే హత్యకు కారణంగా తేల్చారు. దీంతో మిగతా నిందితుల్ని కూడా పట్టుకునేందుకు గాలింపు కొనసాగుతోంది. ఇవాళ నగరంలో పట్టపగలు జరిగిన ఈ హత్యతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సాయంత్రానికి దర్యాప్తులో పురోగతి సాధించారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications