బెజవాడ వస్తారా ... లేక హైదరాబాద్ రమ్మంటారా - చంద్రబాబుకు సాయిరెడ్డి సవాల్...

కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ నివాసానికే పరిమితమవుతున్న చంద్రబాబును ఎలాగైనా బయటికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆయనకు తాజాగా మరో సవాల్ విసిరారు.

విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమకు ఇచ్చిన అనుమతులపై చర్చకు రావాలని వైసీపీ సర్కార్ కు చంద్రబాబు విసిరిన సవాల్ కు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. ఎల్జీ పాలిమర్స్ అనుమతులపై చర్చకు తాను సిద్దమేనని, హైదరాబాద్ నుంచి మీరు విజయవాడ వస్తారా లేక నన్నే హైదరాబాద్ రమ్మంటారా అని చంద్రబాబును ప్రశ్నిస్తూ సాయిరెడ్డి ఇవాళ ట్వీట్ చేశారు.

vijayasai reddy says he is ready to discuss with naidu at vijayawada or hyderabad

ఎల్జీ పాలిమర్స్ అనుమతుల విషయంలో హైదరాబాద్ లో కూర్చుని సవాళ్లు విసురుతున్న చంద్రబాబును ఈ వ్యవహారంలో కార్నర్ చేద్దామనే ఆలోచనతో ఉన్న సాయిరెడ్డి తాజా ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.

vijayasai reddy says he is ready to discuss with naidu at vijayawada or hyderabad

సాయిరెడ్డి ఈ ట్వీట్ తో ఆగకుండా ఎల్జీ పాలిమర్స్ బాధితులకు పరిహారం విషయంలో విపక్షాల వ్యవహారశైలిని తప్పుబడుతూ మరో ట్వీట్ కూడా చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు దిక్కుతోచడం లేదని, వీళ్లు రూ.20 లక్షలు పరిహారం అడిగితే సీఎం జగన్ కోటి రూపాయలు ఇస్తారని, వీళ్లకు ఆలోచన మెదిలే లోపే ఆయన అమలు చేస్తున్నారని సాయిరెడ్డి పేర్కొన్నారు. గొప్ప సలహా ఇస్తే పాటించకూడదనే పట్టుదలకు పోయే స్వభావం జగన్ ది కాదని, కానీ వీళ్లకు ఆ స్ధాయి ఎక్కడిదని సాయిరెడ్డి చురకలు అంటించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+