మరో మూడురోజుల్లో వర్షం.. ఉరుములు, మెరుపులతో కూడిన వాన.. ఎక్కడ అంటే
వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇవాళ ఉదయం నుంచే కాస్త వెదర్ ఛేంజ్ అయ్యింది. వచ్చే మూడు రోజుల వరకు ఆంధ్రప్రదేశ్లో వాతావరణ సూచనలను ఆ శాఖ విడుదల చేసింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇవాళ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు ప్రకటనలో తెలిపారు.
ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రేపు ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. 30-40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. దక్షిణ కోస్తాంధ్రలో ఇవాళ, రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.

ఈ రోజు, రేపు, ఎల్లుండి రాయలసీమలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా వాతావరణం చల్లబడింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications