ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల దుర్మరణం...
పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం (సెప్టెంబర్ 14) ఉదయం భీమవరం నుంచి వెళ్తున్న ఓ కారు తణుకు సమీపంలో అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందగానే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులను స్థానిక మున్సిపల్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్గా పనిచేసే జీవన శేఖర్,కంప్యూటర్ ఆపరేటర్ శ్రీను,వెలుగు డిపార్ట్మెంట్లో పనిచేసే సుభాషిణిగా గుర్తించారు.
భీమవరానికి చెందిన ఈ ముగ్గురు ఉద్యోగులు తణుకులో పనిచేస్తుండటంతో ప్రతీరోజూ కారులో వెళ్లి వస్తుండేవారు. ఎప్పటిలాగే సోమవారం ఉదయం భీమవరం నుంచి తణుకు బయలుదేరారు. కానీ ప్రమాదవశాత్తు కారు పంట కాలువలోకి దూసుకెళ్లడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ ముగ్గురి కుటుంబాల్లో శోకసంద్రంలో మునిగిపోయాయి. ప్రమాద ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Recommended Video
ఈ ఏడాది ఏప్రిల్లోనూ తాడేపల్లిగూడెం నుంచి తణుకు వెళ్లే జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. లారీ చెట్టును ఢీకొట్టడంతో అందులో ఉన్న డ్రైవర్, క్లీనర్ సజీవ దహనమయ్యారు. లారీ ఫినాయిల్ ఆల్కహాల్ బారెల్ లోడ్తో తణుకు వైపుగా వెళ్తుండగా ప్రమాదం జరిగింది. లారీ చెట్టును ఢీకొనడంతో క్షణాల్లో మంటలు చెలరేగి డ్రైవర్, క్లీనర్ సజీవ దహనమయ్యారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications