వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
డిఎస్ పై ఎన్నారైల గరం
సిరిసిల్ల నియోజకవర్గం నేరెళ్ళ ఎంపిటిసి ఆనంద్ రావు ప్రస్థుతం వారి కుటుంబ సభ్యుల సందర్శన నిమిత్తం వాషింగ్టన్ డిసిలో ఉన్నారు. ఆయన ఈ సందర్బంగా మాట్లాడుతూ - తాను తెలుగుదేశం పార్టీకి చెందినప్పటికీ ఈసారి మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి కెటి రామా రావును అత్యధిక మెజారిటి గెలిపించాలని తన ప్రాంత ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. జగదీశ్ బొందుగుల మాట్లాడుతూ - డిఎస్ ను ఓడగొట్టి మన తెలంగాణా ఉద్యమాన్ని ముందుకు తీసికెళ్లి, స్వరాష్ట్రాన్ని సాదిద్ద్ధామని అన్నారు. చివరగా రమాకాంత్ పీచర మాట్లాడుతూ - తాను చిన్న రాష్ట్రాల ద్వారా దేశాభివ్రుద్ది అవుతుందని బాగా నమ్ముతానని వారు అన్నారు. ఇంకా ఈ ప్రెస్ మీట్లో స్రుజన్ ప్రొద్దుటూరి, కిరణ్ కాసుగని, సంపత్ దేశినేని, దయసాగర్ లక్క తదితరులు పాల్గొన్నారు.
Comments
Story first published: Monday, July 26, 2010, 9:49 [IST]