వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిఎస్ పై ఎన్నారైల గరం

By Pratap
|
Google Oneindia TeluguNews

NRI
శుక్రవారం సాయంత్రం ప్రవాస తెలంగాణవాదులు ఉపఎన్నికల సందర్బంగా జై తెలంగాణ ఫోరం(www.jaitelanganaforum.org) ఆధ్వర్యంలో వాషింగ్టన్ డిసిలో ప్రెస్స్ మీట్ నిర్వహించారు. గోపాల్ పిన్నమురెడ్డి ఈ సందర్బంగా మాట్లాడుతూ - తాను, తన కుటుంబ సభ్యులు స్వతహాగా కాంగ్రెస్ వాదులమని, ఈసారి మాత్రం డి శ్రీనివాస్ ను తప్పనిసరిగ ఓడగొట్టాలని నిజామాబాద్ అర్బన్ ఓటర్లుకు విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న కాలంలో మౌనంగా ఉన్న డిఎస్ ఈ రొజు ఏ ముఖం పెట్టుకుని ఓట్ల కోసం వచ్చాడని ప్రశ్నించారు. అలాగే హరి మట్టపల్లి మట్లాడుతూ - ఉద్యోగ, వ్యాపార, చదువుల కోసం నియోజకవర్గం బయట ఉన్న ఓటర్లు పోలింగ్ రోజున తప్పకుండా తమ తమ నియోజకవర్గాలకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకుని రాజీనామా చేసిన త్యాగధనులను గెలిపించాలని కోరారు. వేణుగోపాల్ నక్షత్రం మాట్లాడుతూ - ఓటర్లు అందరు జాగ్రత్తగ కారు గుర్తుకు, నిజామాబాద్ లో కమలం గుర్తుకు వేసి ఓటును మురిగి పొకుండా తెలంగాణ సత్తా చాటాలని అన్నారు.

సిరిసిల్ల నియోజకవర్గం నేరెళ్ళ ఎంపిటిసి ఆనంద్ రావు ప్రస్థుతం వారి కుటుంబ సభ్యుల సందర్శన నిమిత్తం వాషింగ్టన్ డిసిలో ఉన్నారు. ఆయన ఈ సందర్బంగా మాట్లాడుతూ - తాను తెలుగుదేశం పార్టీకి చెందినప్పటికీ ఈసారి మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి కెటి రామా రావును అత్యధిక మెజారిటి గెలిపించాలని తన ప్రాంత ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. జగదీశ్ బొందుగుల మాట్లాడుతూ - డిఎస్ ను ఓడగొట్టి మన తెలంగాణా ఉద్యమాన్ని ముందుకు తీసికెళ్లి, స్వరాష్ట్రాన్ని సాదిద్ద్ధామని అన్నారు. చివరగా రమాకాంత్ పీచర మాట్లాడుతూ - తాను చిన్న రాష్ట్రాల ద్వారా దేశాభివ్రుద్ది అవుతుందని బాగా నమ్ముతానని వారు అన్నారు. ఇంకా ఈ ప్రెస్ మీట్లో స్రుజన్ ప్రొద్దుటూరి, కిరణ్ కాసుగని, సంపత్ దేశినేని, దయసాగర్ లక్క తదితరులు పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X