దుబాయ్ లో పిచ్చిదై పోయిన తెలుగు మహిళ
దానికి తోడుగా ఆమె దేశంలో అక్రమంగా వీసా లేకుండా నివసిస్తుండడంతో ఆమెకు చికిత్స చేయించడంగానీ అలాగని మాతృదేశం పంపించడం గానీ వీలు కాలేదు. సంపాదించిన సంపాదన మొత్తం గుంజుకొన్న భర్త పద్మను పరాయి దేశంలో పరాయి భాషలో విధులపై విడిచిపెట్టాడు. ఆమె సోదరి కూడా ఒకరు దుబాయిలోనే ఉంటుంది. అయినా వీరెవరూ పట్టించుకోలేదు. జాలిపడ్డ కొందరు మహానుభావులు ఆమెను షార్జాలోని చర్చికు తీసుకువచ్చి గేటు ముందు వదిలిపెట్టారు. ఆ తర్వాత దుబాయిలోని ఆల్ రషేద్ ఆసుపత్రిలో మానసిక విభాగంలో చేర్పించిన అనంతరం క్రమంగా కోలుకుంటూ తమది భారతదేశం అని వివరాలు వెల్లడించింది.
పాస్ ఫోర్ట్ వగైరా ఏమి లేకపోవడంతో ఆమెకు భారతీయ కాన్సులేట్ అధికారులు ఎమర్జెన్సీ సర్టిఫికెట్ను జారీ చేసి ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ చేయించి స్వదేశానికి పంపించడానికి ఏర్పాట్లు చేశారు. కానీ ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ప్రయాణం వాయిదాపడింది. ఈ కష్టకాలంలో తోడుగా ఉండాల్సిన భర్త పత్తా లేకుండా పారిపోయాడు. ఆ పిచ్చి తల్లి పిచ్చాసుపత్రిలో మౌనంగా ఉంటూ ఏమి తినకుండా మంచంపై కూర్చుండి దిక్కులు చూస్తుంది. కొన్ని సార్లు ఏడుస్తూ మాతృభూమికి వెళ్తానంటుంది. మరికొన్ని సార్లు వెళ్లనంటూ మోరాయిస్తుంది.