వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దుబాయ్ లో పిచ్చిదై పోయిన తెలుగు మహిళ

By Santaram
|
Google Oneindia TeluguNews

Dubai
జెద్దా: కట్టుకున్న భర్త కాదన్నాడు, తోబుట్టిన చెల్లి పొమ్మంది. పరాయి దేశంలో పడరాని పాట్లు పడ్డ ఆ మహిళ పరిస్ధితులను తట్టుకోలేక పిచ్చిగా మారిపోయి స్వదేశానికి వెళ్లడానికి నిరీక్షిస్తున్నది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన మనుకొండ పద్మ అనే మహిళ పాచిక పని చేయడానికి నాలుగు సంవత్సరాల క్రితం యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్‌లోని దుబాయికి వచ్చిన కొద్ది కాలానికి యజమాని దౌర్జన్యం భరించలేక పారిపోయి అక్రమంగా అనేక ఇళ్లలో రాత్రింబవళ్లు కష్టపడి పని చేస్తూ సంపాదించినా దుబాయిలోనే మేస్త్రీగా పని చేస్తున్న భర్త ఆంజనేయులు గుంజుకోవడమే కాకుండా అనేక ఇబ్బందులు పెట్టడంతో పాటు కుటుంబ సమస్యలను భరించలేక మానసికంగా కృంగిపోయి పిచ్చిగా మారిపోయింది.

దానికి తోడుగా ఆమె దేశంలో అక్రమంగా వీసా లేకుండా నివసిస్తుండడంతో ఆమెకు చికిత్స చేయించడంగానీ అలాగని మాతృదేశం పంపించడం గానీ వీలు కాలేదు. సంపాదించిన సంపాదన మొత్తం గుంజుకొన్న భర్త పద్మను పరాయి దేశంలో పరాయి భాషలో విధులపై విడిచిపెట్టాడు. ఆమె సోదరి కూడా ఒకరు దుబాయిలోనే ఉంటుంది. అయినా వీరెవరూ పట్టించుకోలేదు. జాలిపడ్డ కొందరు మహానుభావులు ఆమెను షార్జాలోని చర్చికు తీసుకువచ్చి గేటు ముందు వదిలిపెట్టారు. ఆ తర్వాత దుబాయిలోని ఆల్ రషేద్ ఆసుపత్రిలో మానసిక విభాగంలో చేర్పించిన అనంతరం క్రమంగా కోలుకుంటూ తమది భారతదేశం అని వివరాలు వెల్లడించింది.

పాస్ ‌ఫోర్ట్ వగైరా ఏమి లేకపోవడంతో ఆమెకు భారతీయ కాన్సులేట్ అధికారులు ఎమర్జెన్సీ సర్టిఫికెట్‌ను జారీ చేసి ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ చేయించి స్వదేశానికి పంపించడానికి ఏర్పాట్లు చేశారు. కానీ ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ప్రయాణం వాయిదాపడింది. ఈ కష్టకాలంలో తోడుగా ఉండాల్సిన భర్త పత్తా లేకుండా పారిపోయాడు. ఆ పిచ్చి తల్లి పిచ్చాసుపత్రిలో మౌనంగా ఉంటూ ఏమి తినకుండా మంచంపై కూర్చుండి దిక్కులు చూస్తుంది. కొన్ని సార్లు ఏడుస్తూ మాతృభూమికి వెళ్తానంటుంది. మరికొన్ని సార్లు వెళ్లనంటూ మోరాయిస్తుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X