అమెరికాలో ఎన్నారైలతో మోహన్ బాబు
తన జీవన ప్రయాణంలోని ఒడిదొడుకులను గుర్తు చేసుకుంటూ సాగిన మోహన్ బాబు ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. అమెరికాలోని పెద్ద విశ్వవిద్యాలయాలను ఆదర్శంగా తీసుకుని, వాటి రీతిలోనే తమ సంస్థను తీర్చిదిద్దాలనే ఆశయాన్ని విష్ణు తన ప్రసంగంలో వెల్లడించారు. ఇందుకు తమకు ప్రవాసాంధ్రుల ప్రోత్సాహం, భాగస్వామ్యం కావాలని కోరారు. ఏటా 25 శాంత మంది విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నామని, క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా అందరినీ ఉద్యోగావకాశాలకు చేరువ చేస్తున్నామని చెప్పారు.
స్థాపన నుమచి ఇప్పటి వరకు శ్రీవిద్యానికేతన్ సాధించిన ప్రగతిని తెలియజేసే వీడియోను తిలకించిన ప్రవాసాంధ్రులు దాదాపు 115,000 డాలర్ల విరాళాలు అందజేశారు. చిన్న పిల్లలు తమ పాకెట్ మనీ కూడబెట్టి, పది, ఇరవై డాలర్లు కూడా విరాళంగా సమర్పించారు. మోహన్ బాబును, విష్ణును డెట్రాయిట్ తెలుగు సంస్థ జ్ఞాపికలతో గౌరవించింది.
శ్రీవిద్యానికేతన్ సంస్థను తమకు పరిచయం చేసిన సతీష్ మందలప, శివరామ్ యార్లగడ్డ తదితరులను సభకు విచ్చేసినవారు అభినందించారు. కార్యక్రమ నిర్వహణలో తోడ్పడిన వంశీ కారుమంచి, సునీల్ పాంత్ర, గోగినేని (జూ) శ్రీనివాస రావు, మోహన్ కోనేరు, దంతేశ్వరరావు, సాగర్ మారం రెడ్డి, చంద్ర కొంపల్లి, ఉదయకుమార్ చాపలమడుగు తదితరులకు నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.