కువైట్‌లో తమిళుడి మృతి

Tamilian dead in road accident in Kuwait
కువైట్‌లో ఈ నెల 22వ తేదీన జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. కువైట్ రోడ్డు నెంబర్ 40 జాతీయ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. తమిళనాడుకు చెందిన ఆండి రెడ్డియార్ చంద్రన్ అనే 43 ఏళ్ల వ్యక్తి ఈ ప్రమాదంలో మరణించాడు.

కోస్టర్ బస్సులో కంపెనీ సిబ్బందిని కార్యాలయం వద్ద దింపేసి తిరిగి వస్తుండగా అతను దుర్మరణం పాలయ్యాడు. అతను నడుపుతున్న కోస్టర్ బస్సు సైన్ బోర్డును ఢీకొట్టింది. దాంతో వెంటనే మంటలు లేచాయి. ఆ మంటల నుంచి అతను తప్పించుకోలేకపోయాడు.

అతను తమిళనాడులోని విరుద్ధనగర్ జిల్లా సత్తూరు తాలూకాలోని రామలింగరపురం గ్రామానికి చెందినవాడు. అతని వివరాలను, ప్రమాదానికి సంబంధించిన ఛాయాచిత్రాలను, అతని ఫోటోను లారెన్స్ గ్లాడీ ఇ - మెయిల్ ద్వారా పంపించారు. లారెన్స్ గ్లాడీ పనిచేస్తున్న సంస్థలోనే ఆండి రెడ్డియార్ చంద్రన్ పనిచేస్తున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+