లవ్ అఫైర్: తెలుగు యువకుడి కాల్చివేత
ఆ సంఘటన ఈ నెల 5వ తేదీన జరిగింది. ఈ సంఘటన సమాచారం గుంటూరు జిల్లా యడ్లపాడులో నివసిస్తున్న దిలీప్ తల్లిదండ్రులకు ఆలస్యంగా ఆందింది. స్కాట్లాండులో నివసిస్తున్న ఓ యువతిని దిలీప్ కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నాడు. ఇరు వైపుల పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నించారు. కానీ ఫలితం కనిపించలేదు.
ఈ క్రమంలో దిలీప్పై యువతి సోదరుడు కాల్పులు జరిపాడని, దిలీప్ అక్కడికక్కడే మరణించాడని వార్తలు వచ్చాయి. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పరీక్షలు నిర్వహించారు. కేసు నమోదు చేశారు.
కుమారుడి మరణవార్త విని తల్లిదండ్రులు విషాద సముద్రంలో మునిగిపోయారు. తమ కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి పంపించాలని కోరుతున్నారు. దీలీప్ మృతదేహాన్ని తెప్పించడానికి పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివరావు, సీతారాం ఏచూరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 17వ తేదీన దిలీప్ మృతదేహం హైదరాబాదు చేరుకోవచ్చునని భావిస్తున్నారు.