NRI News: ఆపద సమయంలో అండగా నిలిచాడు.. ఇప్పుడు తానే ఆపదలో పడ్డాడు..
లండన్ లో భారత్ కు చెందిన వ్యక్తి వీసా కోసం న్యాయపోరాటం చేస్తున్నారు.
ఇండియాకు చెందిన విమల్ పాండ్య అనే వ్యక్తి బ్రిటన్ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. 2011లో ఉన్నత చదువుల కోసం విమల్ ఇంగ్లాండ్ కు వెళ్లాడు. అయితే అతను జాయిన్ అయిన కాలేజీ లైసెన్స్ ను అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది. కాలేజీ లైసెన్స్ రద్దు చేసిన విషయం తెలియని విమల్ 2013లో ఇండియాకు వచ్చాడు.
అతను బంధువుల చికిత్స కోసం ఇక్కడి వచ్చాడు. కొద్ది రోజుల తర్వాత బ్రిటన్ తిరిగి వెళ్లాడు. తిరిగి వెళ్లిన తర్వాత అతనికి షాకింగ్ విషయం తెలిసింది. తను చదువుతున్న కాలేజీ రద్దు అయిందని, దీంతో తను బ్రిటన్ లో నివసించే హక్కు కోల్పోయానని తెలుసుకున్నాడు. 2013 నుంటి వీసా కోసం అతడు పోరాటం చేస్తున్నాడు. విమల్ పాండ్యా లండన్ లోని రోత్ హెరితేలో నివసిస్తున్నారు.

తనకు వీసా ఇవ్వాలంటూ న్యాయపోరాటం చేస్తున్నారు. అయితే అతని పిటిషన్ విచారణకు స్వీకరించిన కోర్టు జనవరి 24న అతనికి వ్యతిరేకంగా తీర్పు చెప్పింది. వలసల విధాన సామాజిక శ్రేయస్సు కోసం దేశంలో అతడు ఉండకూడదని స్పష్టం చేసింగి. అయితే తీర్పును సవాల్ చేసేందుకు 28 గడువు ఇచ్చింది.
విమల్ పాండ్యా కరోనా సమయంలో లండన్ ఎంతో సేవ చేశారు. దాదాపు 50 కుటుంబాలకు ఉచితంగా భోజనం పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న క్వీన్ ఎలిజబెత్-2 అతడిని ప్రత్యేకంగా సత్కరించారు. కానీ అతను ఇప్పుడు వీసా కోసం బ్రిటన్ లో న్యాయపోరాటం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications