TDP Kuwait ఆధ్వర్యంలో ఘనంగా డిజిటల్ మినీ మహానాడు
కువైట్: తెలుగుదేశం పార్టీ వ్యవస్తాపకులు నందమూరి తారక రామారావు 98వ జయంతి, డిజిటల్ మినీ మహానాడును తెలుగుదేశం కువైట్ అధ్యక్షులు కుదరవల్లి సుధాకర రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
పూర్తిగా ఆన్లైన్లో జరిగిన ఈ కార్యక్రమానికి నిజాయితికి నిలువుటద్దం, నిస్వార్ధానికి ప్రతిరూపం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిమాన నాయకుడు కింజారపు రాజకీయ వారసుడు, తండ్రికి తగ్గ తనయుడు, తన చిరునవ్వుతోనే రాజకీయ ప్రత్యర్ధులకి సమాధానం చెప్పగల యువ రాజకీయ ధురందరుడు, మన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ , శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్ హన్ నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారని నిర్వాహకులు తెలిపారు.
వివిధ గల్ఫ్ దేశాలలోని నాయకులు, కార్యకర్తలతో పాటు అమెరికా, ఇతరదేశాలలోని నాయకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో రామ్ మోహన్ నాయుడు ప్రసంగం కార్యకర్తలలో ఉత్తేజాన్ని నింపింది. కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉండే పార్తీ తెలుగుదేశం అనీ, ప్రతి సంవత్సరం ఒక పండుగ లాగా చేసుకునే మహానాడుని ప్రస్తుత కరోనా విపత్కర పరిస్తితులలో పూర్తిగా డిజిటల్ టెక్నాలజీతో చేసుకోవటం ఒక్క తెలుగుదేశానికే దక్కుతుందని అన్నారు.
ఏ కార్యకర్తకి ఆపదవచ్చినా లోకేష్ అన్న అండగా ఎప్పుడు ముందు ఉంటారని అన్నారు. అన్నగారి జన్మదినం సందర్బముగా కేక్ కటింగ్ చేసి జయంతి శుభాకాంక్షలు తెలియ చేసారు. అలాగే విజయవాడ ఆపిల్ సొసైటీ అనాధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని తెలుగుదేశం కువైట్ వారు నిరహించారు.