ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా గంప వేణుగోపాల్
హైదరాబాద్: మాజీ ప్రధాని శ్రీ రాజీవగాంధీ సలహాదారుడిగా పనిచేసిన సామ్ పిట్రోడా ను ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ గా ఇటీవల ఏఐసీసీ నియమించింది. విదేశాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాన్నిరాహుల్ గాంధీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
క్రియాశీలంగా పనిచేసే ఎన్నారైలకు స్థానం కల్పించే ప్రక్రియలో భాగంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ సామ్ పిట్రోడా ఆదేశాల మేరకు యూకే , యూరోప్ అధ్యక్షుడు కమల్ దాలివార్ కార్యవర్గాన్ని ప్రకటిస్తూ తెలంగాణ ప్రాంత ఎన్నారై గంప వేణుగోపాల్ ను ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి గా ,సుధాకర్ రంగులను అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
దక్షిణభారత దేశం నుండి తొలిసారి గ కారదర్శి , అధికార ప్రతినిధి స్థానాలు పొందడంపై, తెలంగాణ వారికి చోటు దొరకడంపై టీపీసీసీ హర్షం వ్యక్తం చేశారు.
తమ నియామకం మరింత బాధ్యత పెంచిందని రాహుల్ గాంధీ , సామ్ పిట్రోడా ,కమల్ దాలివార్ , మధు యాష్కీ , ఉత్తమ్ కుమార్ ,బట్టి విక్రమార్కలకు ధన్యవాదాలుతెలుపుతూ 2019 లో కాంగ్రెస్ అధికారమే లక్ష్యం గా పనిచేస్తామని కార్యదర్శిగా ఎన్నికైన గంప వేణుగోపాల్, అధికారప్రతినిధి రంగుల సుధాకర్ గౌడ్ తెలిపారు .