NRI News: మానవ అక్రమ రవాణా కేసులో కీలక నిందితుడిగా హైదరాబాదీ..!
మానవ అక్రమ రవాణా అనుమానంతో గత వారం 303 మంది భారతీయులతో నికరాగ్వా వెళ్లే విమానాన్ని ఫ్రాన్స్లో నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ విమానం వాట్రీ విమానాశ్రయం నుంచి తిరిగి ఇండియాకు రానుంది. ఈ విషయంపై ఫ్రాన్స్ దర్యాప్తు ప్రారంభించింది. ఇండియాలోని గుజరాత్ లో నుంచి మానవ అక్రమ రవాణా కేసుకు సంబంధించిన కీలక నిందితుడు హైదరాబాద్ కు చెందిన శశికిరణ్ రెడ్డిగా భావిస్తున్నారు.
గత ఏడాది డింగూచా కేసులో కూడా కీలక నిందితుడిగా భావిస్తున్న శశికిరణ్రెడ్డిపై సరైన ఆధారాలు లేకపోవడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేయలేకపోయారు. వాట్రీ విమానాశ్రయం నుంచి ఇండియాకు వచ్చిన ఎయిర్బస్ A340లో ప్రయాణిస్తున్న వారిలో 96 మంది గుజరాత్కు చెందినవారని ఓ వార్త సంస్థ పేర్కొంది. 2022లో డింగుచా కేసు నమోదు అయింది. గత జనవరిలో ఒక కుటుంబంలోని నలుగురు సభ్యులు- జగదీష్ పటేల్ (39), వైశాలి పటేల్ (37), వారి ఇద్దరు పిల్లలు విహంగీ పటేల్ (11), ధార్మిక్ పటేల్ (3) కెనడాలోని ఎమర్సన్ సమీపంలో శవమై కనిపించారు.

వీరంతా గుజరాత్లోని డింగుచా గ్రామానికి చెందిన పటేళ్లుగా గుర్తించారు. వీరు కెనడా నుంచి అక్రమంగా అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నించి చనిపోయారు. వీరు కెనడాలోకి అక్రమంగా ప్రవేశించడానికి జగదీష్ సోదరుడు మహేంద్ర సహకరించినట్లు తెలిసింది. మహేంద్ర శశికిరణ్రెడ్డితో కలిసి పనిచేస్తున్నారని, వారు గుజరాత్ నుంచి వేలాది మందిని అమెరికాకు పంపారని ఆరోపణలు ఉన్నాయి.
శిశికిరణ్ రెడ్డి.. జగదీష్, అతని కుటుంబ సభ్యుల పత్రాలను సిద్ధం చేశాడని..US సరిహద్దును దాటడానికి సహాయం చేయడానికి ఆఫ్షోర్ మానవ స్మగ్లర్లతో సమన్వయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో మరో ముగ్గురిని అరెస్టు చేశారు. శశికిరణ్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా మానవ అక్రమ రవాణా నెట్వర్క్ను నడుపుతున్నాడని, దుబాయ్ నుంచి నికరాగ్వాకు విమానాలను ఏర్పాటు చేస్తున్నాడని వార్త సంస్థ పేర్కొంది. ఇక్కడి నుంచి ప్రజలను అక్రమంగా అమెరికాకు తీసుకెళ్లారని కూడా వివరించింది.
Mumbai, Maharashtra: CISF officials are interrogating the passengers and some passengers are still being interrogated. Many people have been allowed to leave after questioning: CISF officials https://t.co/BzBHXTyo7Y
— ANI (@ANI) December 26, 2023
గత శుక్రవారం ఫ్రాన్స్లో నిలిచిపోయిన లెజెండ్ ఎయిర్లైన్స్ ఎయిర్బస్ A340 లో విమాన ప్రయాణికులను రెండు రోజుల పాటు ప్రశ్నించారు.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications