NRI News: ఆర్మన్ సింగ్ హత్య కేసులో ఐదో నిందితుడు అరెస్ట్..
పశ్చిమ ఇంగ్లండ్లో ఓ ముఠా చేసిన మెరుపుదాడిలో 23 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన డెలివరీ బాయ్ ఆర్మన్ మృతి చెందాడు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఐదోవ నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆర్మన్ ను హత్య చేసిన కేసులో ఐదవ వ్యక్తిపై అభియోగాలు మోపినట్లు పోలీసులు తెలిపారు. ఆగస్టు 21న ష్రూస్బరీలోని బెర్విక్ అవెన్యూలో పార్శిళ్లను డెలివరీ చేస్తుండగా డైనమిక్ పార్శిల్ డిస్ట్రిబ్యూషన్లో పనిచేసిన ఆర్మన్ సింగ్ పై కొందరు దుండగులు దాడి చేశారు. దాడిలో ఆర్మన్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
పీటర్బరోలోని పేనెల్స్కు చెందిన 23 ఏళ్ల సుఖ్మన్దీప్ సింగ్ను ఆగస్టు 31న అరెస్టు చేసినట్లు వెస్ట్ మెర్సియా పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. అతనిపై సెప్టెంబరు 1న ఆర్మన్ సింగ్ హత్య చేశారని అభియోగాలు మోపారు. మరుసటి రోజు కిడ్డెర్మిన్స్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. నేరస్థుడికి సహాయం చేసిన వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతను బెయిల్పై ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ హత్యంకు పాల్పడిన వారందారు భారత సంతతికి చెందినవారేనని పేర్కొన్నారు.

ఈ హత్యలో స్థానికులు ఎవరు లేరని చెప్పారు. ఈ హత్యకు సంబంధించి టిప్టన్కు చెందిన అర్ష్దీప్ సింగ్, 24, డడ్లీకి చెందిన జగ్దీప్ సింగ్ 22, శివదీప్ సింగ్, 26, మంజోత్ సింగ్, 24, స్మెత్విక్కు చెందిన 24 ఏళ్లను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. నలుగురు నిందితులను ఆగస్టు 30న వోల్వర్హాంప్టన్ క్రౌన్ కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం వారు రిమాండ్లో ఉన్నారు. హత్య జరిగిన రోజు ఉదయం 11 గంటల నుంచి ఆ ప్రాంతంలో కారు ఆపివేయడం కనిపించిన తర్వాత కత్తులు, బేస్ బాల్ బ్యాట్లు, పారతో ఆయుధాలు ధరించిన వ్యక్తులు కనిపించారని ప్రత్యక్ష సాక్షులు స్థానిక మీడియాకు తెలిపారు.
నిందితులు డబ్బు కోసం హత్య చేయలేదని విచారణ అధికారి అనుమానిస్తున్నారు. ఆర్మన్ కు నిందితులు తెలుసని చెప్పారు. "ఆర్మన్ డెలివరీ వ్యక్తి అని మాకు తెలుసు, అయితే ఈ దశలో అతని మరణానికి ఇదే కారణమని మేము నమ్మడం లేదు. మేము దీనిని దోపిడీగా పరిశోధించడం లేదు. నేరంలో పాల్గొన్న వారికి ఒకరికొకరు తెలుసు " విచారణ అధికారి బెల్లామీ చెప్పారు. "మాకు జరిగినది మరొక కుటుంబానికి జరగాలని మేము కోరుకోము. వారి దర్యాప్తును శ్రద్ధగా నిర్వహించి మద్దతు ఇచ్చినందుకు మేము పోలీసులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము " అని ఆర్మన్ తల్లి చెప్పారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications