ఇద్దరు ప్రొఫెసర్లకు అవార్డులు ప్రకటించిన ఎన్నారై గ్రూప్
కెమెస్ట్రీ, బయో కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ సుభ్రంగ్షు మండల్కి మహాత్మాగాంధీ ప్రవాసీ సమ్మాన్ అవార్డు, కెమిస్ట్రీ, బయో కెమెస్ట్రీ ప్రొఫెసర్ కృష్ణన్ రాజేశ్వర్కు హింద్ రతన్ అవార్డును బహూకరించనున్నట్లు వెల్లడించింది. ఈ అవార్డులు విదేశాల్లో భారత జాతి కీర్తి ప్రఖ్యాతలు చాటినందుకు ఇస్తున్నట్లు ఎన్నారై అసోసియేషన్ పేర్కొంది. ఈ అవార్డులను అక్టోబర్లో లండన్లో జరుగనున్న ఎన్నారై వెల్ఫేర్ సొసైటీ కాన్ఫరెన్స్ సందర్భంగా మండల్కు, ఇండియాలో జరుగనున్న కాన్ఫరెన్స్లో రాజేశ్వర్కు అందజేయనున్నట్లు తెలిపింది.
డాక్టర్ రాజేశ్వర్, డాక్టర్ మండల్లు తమ యూనివర్సిటీ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేశారని, వారి సేవలు అమూల్యమని, తమ వర్సిటీ విద్యార్థుల భవిష్యత్ను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో వీరి పాత్ర, పరిశోధనలు అమోఘమని యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్, ప్రోవోస్ట్ రోనాల్డ్ ఎల్సన్బూమర్ అన్నారు.
తాము చేసిన కృషి భారతీయులు విదేశాల్లో మరింత రాణించేందుకు దోహదపడుతుందని, తమను సత్కరించాలని ఎన్నారై అసోసియేషన్ భావిస్తుండటం తనకు ఎంతో ఆనందంగా ఉందని, వారికి కృతజ్ఞతలని రాజేశ్వర్ తెలిపారు. ఎన్నారై వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి అవార్డును అందుకోనుండటం ఎంతో గౌరవంగా ఉందని మరో ప్రొఫెసర్ మండల్ అన్నారు. మండల్ 2005లో నుంచి యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో ప్రొఫెసర్గా పని చేస్తున్నారు.