జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ ఎన్నో విభిన్నమైన ఆసక్తికరమైన చర్చలు జరిగాయి. 10వ రోజు కూడా పలు ఆసక్తికరమైన చర్చలు కొనసాగుతాయి. కొందరు ప్రముఖులు ఈ సెషన్స్కు హాజరై తమ అభిప్రాయాలను పంచుకుంటారు.
Recommended Video
ప్రముఖ జర్నిలిస్ట్ భర్కా దత్ రాసిన పుస్తకం హెల్ అండ్ బ్యాక్ పై చర్చించడం జరుగుతుంది.కరోనాకు ముందు కరోనా తర్వాత పరిస్థితులపై చర్చించడం జరుగుతుంది. కరోనా సమయంలో చాలామంది వలసదారులు తమ ఊళ్లకు కొన్ని వందల వేల కిలోమీటర్లు నడిచి వెళ్లారు. ఆ సమయంలో పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగాను ఉన్నాయి. ఇక నోబెల్ పురస్కార గ్రహీత అభిజీత్ వి. బెనర్జీ కూడా తన అమూల్యమైన అభిప్రాయాలను ఇక్కడ పంచుకుంటారు. సాధారణంగా ఆర్థికవేత్త అయిన అభిజీత్ తనలోని మరో కోణాన్ని తన పుస్తకంలో ఆవిష్కరించారు. వంటలపై తాను రాసిన పుస్తకంకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో పలు రకాల రెసీపీల గురించి ఆయన చెప్పుకొస్తారు.
మరో వెటరన్ జర్నలిస్టు వీర్ సంఘ్వీ ఈ మధ్యనే కలినరీ కల్చర్ అనే స్వతంత్ర సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా భారత్లోని బెస్ట్ స్ట్రీట్ ఫుడ్ వెండార్స్ మరియు చెఫ్స్ను పరిచయం చేశారు. జర్నలిస్ట్ ప్రగ్యా తివారీతో బెస్ట్ ఫుడ్స్ గురించి చర్చించడం జరుగుతుంది.
9వ
రోజు
రౌండప్
13
మార్చి
జరిగిన
చర్చలో
శశి
థరూర్
మరో
జర్నలిస్టు
వీర్
సంఘ్వీతో
చర్చలో
పాల్గొన్నారు.
భారత
భవిష్యత్తుపై
తాను
ఆందోళన
చెందుతున్నట్లు
శశి
థరూర్
చెప్పుకొచ్చారు.
భారత్
లో
ప్రస్తుతం
కొందరికి
కొన్ని
దొరకడం
లేదని
ఇది
కొన్ని
రోజుల్లో
అందరికి
దొరకవని
అన్నారు.
భారత
దేశ
చరిత్ర
సంస్కృతిపై
కూడా
మరో
సెషన్లో
చర్చ
జరిగింది.
ఇందులో
ప్రొఫెసర్
ఉపిందర్
సింగ్
మరియు
విలియం
డాల్రింపుల్తో
చర్చలో
పాల్గొన్నారు.
మరో చర్చలో శశి థరూర్, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి మదన్ బి లోకూర్, జర్నలిస్ట్ స్వాతి చతుర్వేదితో ప్రముఖ పారిశ్రామికవేత్త మోహిత్ సత్యానంద్తో చర్చించారు.పెగాసస్ సాఫ్ట్వేర్ పై చర్చించారు. వీకంతా డిజిటల్ యుగం గురించి చర్చించారు. అదే సమయంలో మోడర్న్ గవర్నెన్స్ ఎలా ఉండాలన్నదానిపై చర్చించారు.
ఇక Jaipur Literature Festivalలో మీరు పాల్గొనాలంటే ముందుగా వెబ్సైట్కు లాగిన్ అయి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
RECOMMENDED STORIES