పచ్చటి కలలు: పీఠభూమి
కందుకూరి శ్రీరాములు తన ముప్పై ఏళ్ల సుదీర్ఘ కవితా ప్రయాణంలో మడమ తిప్పని యోధుడిగా నడక సాగిస్తూనే ఉన్నాడు. కవిత్వమే జీవితంగా భావించిన శ్రీరాములు తన సాహిత్య రాజకీయమేమిటో, జీవిత సారాంశమేమిటో ఆయన కవిత్వం చెబుతుంది.
సమూహంలో ఒంటరివాడై పోతున్న మనిషి గురించి, సామాజిక రాజకీయార్థిక శక్తుల దుష్టభావాల గురించి, మనిషితనాన్ని పీల్చేసి వాకిలి నుంచి పెరటి దాకా చొచ్చుకొని వచ్చిన వస్తు సంస్కృతి గురించి శ్రీరాములు ఆవేదన ఈనాటిది కాదు. ఆగ్రహం వ్యక్తం చేయడం కర్తవ్యం గుర్తు చెయ్యడమూ కొత్తేమీ కాదు.
ఇటీవల వచ్చిన శ్రీరాములు పీఠభూమి సంపుటి ఆయన తాత్వికతకు అద్దం పట్టిన కావ్యం. వలసవాదుల చేతిలో, భూస్వాముల పడగనీడలో నిస్సారమైపోయిన పీఠభూమిపై నిల్చొని ప్రజల గోడును వినిపిస్తాడు. దీనికి కారకులైన వారిపై ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తాడు. భూమి నీరు లేనిదే జీవి లేదు. మనిషి మనుగడ అసలుకే లేదు. ఈ రెంటిని తనది గాకుండా చేస్తున్న ప్రపంచీకరణ విషకోరల్నించి మనిషిని కాపాడే ప్రయత్నం చేస్తాడు. మనిషికీ మట్టికీ మధ్య గల ప్రగాఢ అనుబంధాన్ని తెలియజేస్తాడు.
బతుకును మట్టిగా చేసుకున్నవాడు
పది మొక్కల్ని మొలిపిస్తాడు
ముద్దలు ముద్దలుగా చేసి
ఇల్లును నిర్మిస్తాడు - అని అనడంలో కవి తాత్వికత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. మట్టిని నమ్ముకున్న వాడెప్పుడూ తన కోసం బతకలేదని, పది మందిని బతికిస్తూ తాను బతికాడని చెప్పడంలో వాస్తవిక పరిశీలన ఉంది.
శ్రీరాములు తన కవితా సంపుటికి పీఠభూమి అని పేరు పెట్టడంలోనే గొప్ప ఔచిత్యం దాగి ఉన్నది. తాను పుట్టి పెరిగిన నేల ఒకప్పుడు ప్రపంచం ఆకలి తీర్చిన పీఠభూమి. కానీ ఇప్పుడది ప్రపంచీకరణ మింగేసిన బీడు భూమి. నీటి లక్షణం, భూముల్లాంటి మనుషులు ఒకటే కాబట్టి ఇక్కడ పీఠభూమి అని పేరు పెట్టడంలోనే గొప్ప ఔచిత్యం దాగి ఉంది. తాను పుట్టిపెరిగిన నేల ఒకప్పుడు ప్రపంచం ఆకలి తీర్చిన పీఠభూమి. కానీ ఇప్పుడది ప్రపంచీకరణ మింగేసిన బీడు భూమి. నీటి లక్షణం, భూముల్లాంటి మనుషులు ఒకటే కాబట్టి ఇక్కడ పీఠభూముల్లాంటి మనుషులు సారాన్ని కోల్పోయారు. పచ్చని పైరుతో కనబడే పల్లెలు ఎడారిగా మారిపోయాయి.
చెండోలె ఎగిరే నా పల్లెలు
ఒకే ఒక అమాయకపు మోమున్న పల్లెటూరు
పల్లెను జింకపిల్లతో పోల్చడంలో కవి వాస్తవిక సౌందర్య దృష్టి అర్థమవుతుంది. కవి జీవిస్తున్న సామాజిక పరిస్థితులే అతని కవితావస్తువులు. ఆ సమాజంలోని జీవితాలలోంచి వినబడే వేదనాభరిత మూల్గులే కవి శైలీశిల్పాలనుకుంటే శ్రీరాములు కవిత్వమెప్పుడూ సజీవ శిల్పమే.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications