మైనంపాటి భాస్కర్ కన్నుమూత
ఆయన రచనల్లో ఎక్కువ సైన్స్ ధృక్ఫథం (ఫిక్షన్)తో ఉన్నా యి. 1994లో ఆయన రచించిన బుద్ధిజీవి అనే నవల ఎక్కువ ప్రాచుర్యం పొందింది. ఆయన నవలల్లో బివేర్ ఆఫ్ గాడ్స్ అనే కథ పలు భాషల్లో ప్రచురించబడింది. వెనె్నలమెట్లు నవల ఆధారంగా ‘అరుణకిరణం' సినిమా తీశారు. మై నంపాటి రచించిన సైన్స్ ఫిక్షన్ నవలలు కొన్ని వా షింగ్టన్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్లో భద్రపరిచారు.
సినిమా సమీక్షలను కూడా రాసి ఆ రంగం వారి ఆదరాభిమానాలను పొందారు. కొంత కాలం ప్రభుత్వ ఉద్యోగం చేసిన మైనంపాటి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ఆ మిగిలిన సమయాన్ని రచనలు కోసం వినియోగించారు.
ఆయన హైదరాబాదులోని యూసుఫ్గుడాలో నివాసం ఉంటూ వచ్చారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు జరిగాయి. మైనంపాటి భాస్కర్ స్వస్థలం ప్రకాశం జిల్లా మైనంపాడు. తన బుద్ధిజీవి నవలను కాపీ కొట్టి శంకర్ రోబో సినిమా తీశారని ఆయన ఆ మధ్య కాలంలో ఆరోపించారు.