కవి జానుమద్ది కన్నుమూత

Janaumaddi Hanumachastri passes away
కడప: ప్రముఖ కవి జానముద్ది హనుమాచ్ఛాస్త్రి (90) శుక్రవారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కడప రిమ్స్ అసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కడపలోని సిపి బ్రౌన్ లైబ్రరీ వ్యవస్థాపక కార్యదర్శిగా సేవలందించిన హనుమచ్ఛాస్త్రి, తెలుగు సాహిత్య రంగానికి విశేష సేవలందించారు.

ప్రజల సందర్శనార్థం జానమద్ది భౌతికకాయాన్ని బ్రౌన్ గ్రంథాలయంలో ఉంచారు. శుక్రవారం సాయంత్రం జానమద్ది భౌతికకాయానికి కడపలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జానమద్ది కథా రచనే కాకుండా వివిధ పత్రికలలో, సంచికలలో 2,500 పైగా వ్యాసాలు రాశారు. 16 గ్రంథాలు వెలువరించారు.

జానుమద్ది హనుమచ్ఛాస్త్రి 1926 సెప్టంబర్‌లో అనంతపురం జిల్లా రాయదుర్గంలో జన్మించారు. 1946లో బళ్లారిలోని ప్రభుత్వ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. మా సీమ కవులు, నాట్యకళా ప్రపూర్ణ బళ్లారి రాఘవ జీవిత చరిత్ర, కస్తూరి కన్న సాహిత్య సౌరభం -2, కడప సంస్కృతి - దర్శనీయ స్థలాలు, సిపి బ్రౌన్ చరిత్ర వంటి పలు గ్రంథాలను ఆయన రచించారు.

కడపలో సి.పి.బ్రౌన్ స్మారక గ్రంథాలయ ట్రస్టును నెలకొల్పి, దాని కార్యదర్శిగా అహర్నిశలూ పాటుపడ్డారు. రాష్ట్రంలోని వివిధ తెలుగు సాహిత్య కవులు, రాజకీయ నాయకులు జానముద్ది మరణానికి తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జానముద్ది హనుమాశ్చాస్త్రి మృతికి సంతాపం తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+