11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్
ఓ చిరు ప్రాణి. దీని బరువు ఓ 300 గ్రాముల వరకు ఉంటుంది. శాస్త్రీయ నామం బార్-టెయిల్డ్ గాడ్విట్. సింపుల్ గాబీ6 బర్డ్ అని పిలుస్తుంటారు. ఇది తాజాగా వార్తల్లోకెక్కింది. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. దీనికి కారణం- అమెరికాలో ఎక్కడో మారుమూల ఉండే అలస్కాలోని కుస్కోక్విమ్ డెల్టా నుండి ఆస్ట్రేలియాలోని టాస్మానియా వరకు నాన్ స్టాప్ గా ప్రయాణించింది. ఎక్కడా ఆగలేదు. సప్తసముద్రాలను అలవోకగా దాటేసింది.
11 రోజుల్లో 13,560 కిలోమీటర్ల ప్రయాణం..
అలస్కా డెల్టా నుండి టాస్మానియా వరకు మధ్య దూరం సుమారు 13,560 కిలోమీటర్లు. ఈ దూరాన్ని 11 రోజుల్లోనే అధిగమించిందంటే దాని వేగం ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలోనే సుదీర్ఘ నిరంతరాయ వలస జీవిగా దీని గిన్నిస్ రికార్డుకెక్కింది. ఈ బర్డ్ నాన్ స్టాప్ జర్నీని శాస్త్రీయంగా లెక్కగట్టారు యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే శాస్త్రవేత్తలు. దీనికి సోలార్ ట్యాగ్ను అమర్చారు. దీని సహాయంతో ప్రయాణాన్ని ట్రాక్ చేశారు. బీ6 11 రోజులు ఏమీ తినకుండా, తాగకుండా, విశ్రాంతి లేకుండా నిరంతరాయంగా ప్రయాణం సాగించింది.

రుతువులకు అనుగుణంగా వలస..
బార్-టెయిల్డ్ గాడ్విట్.. సముద్రపు పక్షి. రుతువులకు అనుగుణంగా వలస వెళ్తుంటుంది. సుదీర్ఘ ప్రయాణానికి ముందు ఇది తన శరీరాన్ని అనువుగా మార్చుకుంటుంది. వలసకు కొన్ని వారాల ముందు, ఇది విపరీతంగా ఆహారం తీసుకుంటుంది. శరీరంలో కొవ్వును భారీగా నిల్వ చేసుకుంటుంది. బరువు రెట్టింపు చేసుకుంటుంది. అంతర్గత అవయవాలను కుదించుకుంటుంది. కడుపు, ప్రేగులు, కాలేయం 55 శాతం వరకు చిన్నవిగా మారుతాయి.
శరీరంలో కొవ్వు నిల్వ.. అదే ఆహారం
ప్రయాణ సమయంలో ఇది ఎక్కడే గానీ ఆహారం తీసుకోనందు వల్ల వీటిని కుదించుకోవడం దానికి అవసరం. ప్రయాణానికి ముందు ఎక్కువగా తినడం వల్ల ఏర్పడే కొవ్వును నిల్వ చేసుకుంటుంది. అందులో నుంచే ఎగరడానికి అవసరమైన శక్తి, నీటిని ఉత్పత్తి చేసుకుంటుంది. ఇలా ఈ గాడ్ విట్ బర్డ్ తన కడుపునే అనుకూలంగా మార్చుకుంటుంది. బరువు తగ్గిన తర్వాత తేలికపడి ప్రయాణం మొదలుపెడుతుంది.
తినదు, తాగదు, నిద్రపోదు..
11 రోజుల నిరంతరాయ ప్రయాణంలో ఈ పక్షి తినదు, తాగదు, నిద్రపోదు. మెదడుకు విశ్రాంతి అవసరం. కాబట్టి ఎగురుతూనే మగతగా నిద్రపోతుంది. దీనిని 'యూనిహెమిస్ఫెరిక్ స్లో-వేవ్ స్లీప్' అంటారు. ఈ ప్రక్రియలో ఒక కన్ను తెరిచే ఉంటుంది. మెదడులో సగం భాగం నిద్రపోగా, మిగిలిన సగం మేల్కొని ఉంటుంది. ఎగురుతూనే ఒక కన్ను విశ్రాంతి తీసుకోగా, మరొకటి దారి చూపిస్తుంది. ఇలా ప్రయాణంలోనే మార్చి మార్చి విశ్రాంతి తీసుకుంటుంది.
క్వాంటం మెకానిజం ద్వారా..
తన ప్రయాణ దిశానిర్దేశానికి భూ అయస్కాంత క్షేత్రాన్ని ఆధారంగా తీసుకుంటుంది. ఈ పక్షి కళ్ళలో ఉండే క్వాంటం మెకానిజం ద్వారా అయస్కాంత రేఖలను ఇది గుర్తిస్తుంది. నక్షత్రాలు, సూర్యుడు, గాలి పీడనం, వాతావరణ మార్పుల ఆధారంగా దారిని కచ్చితంగా నిర్ణయించుకుంటుంది. ఇది పాత జీపీఎస్ కన్నా ఎంతో మెరుగైనది. అలస్కాలో వేసవిలో పుష్కలంగా ఆహారం, ఆస్ట్రేలియాలోని టాస్మానియాలో శీతాకాలంలో సురక్షిత ఆశ్రయం లభిస్తుందని ఈ బర్డ్ భావించడం వల్లే క్లిష్టమైన ఈ ప్రయాణాన్ని పూర్తి చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఏ మాత్రం బెదరదీ బర్డ్..
మహాసముద్రాల మీదుగా ఏకధాటిగా ప్రయాణం అత్యంత క్లిష్టతరం. కింద భూమి ఉండదు. ఎక్కడైనా విశ్రమించాలన్నా ఎటువంటి ఆధారం దొరకదు. తుఫానులు, సుడులు తిరిగే సముద్రపు గాలులు, తీవ్రమైన చలి, అదే స్థాయిలో వేడిని ఎదుర్కొనాల్సి ఉంటుంది. కొన్నిసార్లు గాలి వ్యతిరేక దిశలో వీయడం వల్ల ప్రయాణం మరింత కష్టతరమవుతుంది. అయినప్పటికీ- వీటికి ఏ మాత్రం బెదరదీ బర్డ్. వేల సంవత్సరాలుగా ఈ పక్షి ఇదే మార్గంలో వలస వెళ్తుంది.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications