పాకిస్థాన్, చైనా కు బిగ్ షాక్.. ప్రళయ్ మిసైల్ వచ్చేస్తోంది..!
సాలిడ్ ప్రొపెల్లెంట్, క్వాజీ బాలిస్టిక్ మిసైల్స్ ను భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలామ్ దీవి నుంచి ఈ పరీక్షల్ని సక్సెస్ ఫుల్ గా నిర్వహించారు. ఈ క్షిపణుల్ని DRDO అభివృద్ధి చేసింది. డిసెంబర్ 31 న ఉదయం 10 గంటల 30 నిమిషాల సమయంలో ఈ పరీక్షలు నిర్వహించగా విజయవంతం అయినట్లు.. ఈ మిషన్ లక్ష్యాలను అందుకున్నట్లు DRDO అధికారులు వెల్లడించారు.
భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO).. తాజాగా ప్రళయ్ క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని అబ్దుల్ కలామ్ ద్వీపంలోని ప్రయోగ కేంద్రంలో నిర్వహించగా, విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ రెండు క్షిపణులు పరీక్షల సమయంలో అత్యంత ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో మోహరించిన ట్రాకింగ్ సెన్సార్ల ద్వారా క్షిపణి పనితీరును ధృవీకరించామని అన్నారు.
Salvo lunch of two Pralay Missile in quick succession from same launcher were successfully conducted today from ITR, Chandipur. The flight test was conducted as part of User evaluation trials. Both the missiles followed the intended trajectory meeting all flight objectives. pic.twitter.com/QeJYVDhL1l
— DRDO (@DRDO_India) December 31, 2025
దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ క్షిపణులు 150 నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలవని తెలిపారు. ఈ మిసైల్స్ పేలోడ్ కెపాసిటీ 500 కిలోల నుంచి 1000 కిలోలు ఉంటుందని వివరించారు. మరోవైపు ప్రళయ్ క్షిపణి పరీక్షలు విజయవంతం కావడంతో DRDO శాస్త్రవేత్తలను రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు.

ఇక ఈ ప్రళయ్ క్షిపణి.. అత్యాధునిక నావిగేషన్, గైడెన్స్ వ్యవస్థలతో పనిచేస్తుంది. వివిధ రకాల వార్ హెడ్ లను మోసుకెళ్తూ శత్రువుల స్థావరాలపై విరుచుకుపడగలిగే సత్తా ఈ ప్రళయ్ క్షిపణుల సొంతం. ఈ మేరకు హైదరాబాద్ లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI)తో పాటుగా భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) వంటి సంస్థల సహకారంతో దీనిని అభివృద్ధి చేశారు. ఇక త్వరలోనే ప్రళయ్ క్షిపణులు సైన్యంలో చేరనున్నాయి. ఈ మిసైల్స్ ను పృథ్వీ డిఫెన్స్ వెహికల్ ఆధారంగా ప్రయోగించనున్నారు.నియంత్రణ రేఖ, వాస్తవాదీన రేఖ వద్ద ప్రళయ్ మిస్సైల్ ను మోహరించే ఛాన్స్ ఉంది. దీంతో దాయాది దేశాలైన పాకిస్థాన్, చైనాలకు ఇదో షాక్ అని చెప్పొచ్చు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications