తప్పుచేశారు సామీ.. ! టీమిండియాకు ఏబీ డివిలియర్స్ షాక్..!
దుబాయ్ లో జరిగిన ఆసియాకప్ లో విజయం సాధించాక ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛీఫ్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛీఫ్ మొహసిన్ నక్వీ నుంచి ట్రోఫీ తీసుకునేందుకు టీమిండియా నిరాకరించింది. దీంతో ట్రోఫీని నక్వీ అలాగే హోటల్ కు పట్టుకుని వెళ్లిపోయారు. ఆ తర్వాత నక్వీ.. ట్రోఫీ కావాలంటే స్వయంగా టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ వచ్చి తీసుకోవాలని షరతు పెట్టారు. దీంతో బీసీసీఐ నక్వీని ఏసీసీ ఛీఫ్ పదవి నుంచి అభిశంసించేందుకు పావులు కదిపింది. విషయం గ్రహించిన నక్వీ యూఏఈ బోర్డుకు ఆ ట్రోఫీ అప్పగించి భారత్ ను తీసుకోవాలని సూచించారు. దీంతో వివాదం సద్దుమణిగింది.
అయితే ఈ వివాదం అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ మొత్తం వివాదంలో తప్పెవరిది అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఇందులో భారత్ తప్పు చేసిందా లేక నక్వీ ట్రోఫీ ఇవ్వకుండా తప్పు చేశారా అన్న చర్చ జరుగుతోంది. దీనిపై స్పందించిన దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా ఆసియాకప్ ట్రోఫీ తీసుకోని టీమిండియాకు ఏబీడీ షాకిచ్చాడు.

భారత్ ఆసియా కప్ గెలిచిన తర్వాత నెలకొన్న గందరగోళ పరిస్థితులపై ఏబీ డివిలియర్స్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. క్రీడలు, భౌగోళిక రాజకీయాల మధ్య స్పష్టమైన విభజన ఉండాలని ఏబీ సూచించాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడి నుండి భారతదేశం ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించడం, ఆ తరువాత జరిగిన ఇబ్బందికరమైన పరిణామాలపై ఏబీ మాట్లాడారు. టోర్నమెంట్ మొత్తంలో భారత్, పాకిస్తాన్ ఆటగాళ్ల మధ్య సంభాషణలో స్పష్టమైన శత్రుత్వం ఉందన్నారు. కరచాలనాలు, మైదానంలో సూదితో కొట్టడం, పతకాలు, వెండి సామాగ్రి కోసం కొనసాగుతున్న ప్రతిష్టంభన ఆటను ముఖ్యాంశాలలో చోటు కోసం పోరాడనివ్వలేదని ఏబీ తెలిపాడు.

ట్రోఫీని ఇచ్చే వారిపై టీమిండియా సంతోషంగా లేదని, అది క్రీడలకు సంబంధించినది కాదని తాను భావిస్తున్నట్లు ఏబీ తెలిపాడు. రాజకీయాలు పక్కన పెట్టాలని, క్రీడకు సంబంధించిన అంశాల గురించి చర్చించుకోవాలన్నాడు. ఇలాంటి పరిణామాలు చాలా బాధాకరమన్నాడు. కానీ భవిష్యత్తులో వారు వివాదాలు పరిష్కరించుకుంటారని ఆశిస్తున్నట్లు ఏబీ డివిలియర్స్ తెలిపాడు.












Click it and Unblock the Notifications