Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జనవరి 15 వరకూ అన్ని మ్యాచ్ లు అక్కడే..! బీసీసీఐ కీలక నిర్ణయం..!

లక్నోలోని ఎకానా స్టేడియంలో నిన్న భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే మంచు కారణంగా రద్దు కావడం తీవ్ర దుమారం రేపుతోంది. మంచు ఉంటుందని తెలిసినా బీసీసీఐ ఇలా మ్యాచ్ పెట్టడం ఎందుకు, రద్దు చేయడం ఎందుకని ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే ధర్మశాలలో జరిగిన మ్యాచ్ లో సైతం మంచు ప్రభావం తీవ్రంగానే కనిపించింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

భారత్ లో మంచు కురిసే ఈ సీజన్ లో బీసీసీఐ పలు అంతర్జాతీయ మ్యాచ్ లతో పాటు దేశవాళీ టోర్నీలు కూడా నిర్వహించాల్సి ఉంది. ఇందులో జైపూర్ వేదికగా విజయ్ హజారే ట్రోఫీ 50 ఓవర్ల టోర్నమెంట్ డిసెంబర్ 24 నుండి జనవరి 18 వరకు జరగాల్సి ఉంది. అలాగే భారత్,దక్షిణాఫ్రికా మధ్య చివరి టీ20 రేపు అహ్మదాబాద్ లో జరగాల్సి ఉంది. ఆ తర్వాత భారత్-న్యూజీలాండ్ వన్డే సిరీస్ కూడా జనవరి 11 నుండి జరగాల్సి ఉంది. దీనికి వడోదర, రాజ్‌కోట్ , ఇండోర్‌ వేదికలుగా ఇప్పటికే నిర్ణయించారు.

Following Fog Chaos BCCI Signals Major Policy Shift for T20I Venue Selection

అయితే తాజాగా లక్నోలో భారీ మంచు కారణంగా టీ20 మ్యాచ్ రద్దు కావడంతో బీసీసీఐపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో తాజా పరిస్ధితిని సమీక్షించేందుకు బీసీసీఐ పెద్దలు సమావేశం కాబోతున్నారు. ఇందులో ఉత్తర భారత దేశంలోని నగరాల్లో షెడ్యూల్ చేసిన మ్యాచ్ లను దక్షిణాదికి, అలాగే పశ్చిమ భారత దేశంలోని నగరాలకు మార్చాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే భారత్-దక్షిణాఫికా చివరి టీ20 మ్యాచ్ వేదిక మార్చేందుకు సమయం లేనందున అహ్మదాబాద్ లోనే నిర్వహించే అవకాశం ఉంది. ఆ తర్వాత జరిగే విజయ్ హజారే ట్రోఫీతో పాటు భారత్-కివీస్ సిరీస్ లో మ్యాచ్ లను దక్షిణాదికి తరలిస్తారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+