Virat Kohli: ఎన్ని మిస్సవుతున్నామో ? కొహ్లీ రిటైర్మెంట్ పై ఆర్సీబీ ట్వీట్ ..!
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లీ ఇవాళ టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు. కీలకమైన ఇంగ్లాండ్ సిరీస్ కు ఎంపిక కావడం కష్టమేనని భావించిన కొహ్లీ ఇవాళ రిటైర్మెంట్ ప్రకటన చేసేశాడు. ఈ మేరకు ఇన్ స్టా గ్రామ్ లో కీలక ప్రకటన చేశాడు. దీంతో కింగ్ కొహ్లీ అభిమానులు దీనిపై స్పందిస్తుందన్నారు. కొందరు కొహ్లీ ప్రకటనను స్వాగతిస్తుండగా.. మరికొందరు మాత్రం అప్పుడే టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పాల్సింది కాదంటున్నారు. ఈ నేపథ్యంలో కొహ్లీ రిటైర్మెంట్ పై అతని ఐపీఎల్ టీమ్ ఆర్సీబీ స్పందించింది.
విరాట్ కొహ్లీని అభిమానులు ఇన్నాళ్లూ మైదానంలో ఎలా చూడాలనుకున్నారో, ఇప్పుడు రిటైర్మెంట్ తో ఏం మిస్సవుతున్నారో నాలుగు ముక్కల్లో అభివర్ణిస్తూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ మేనేజ్ మెంట్ ఇవాళ ఓ ఎమోషనల్ ట్వీట్ చేసింది. ఇందులో "ఆ నడక, ఆ షాట్లు, ఆ హావభావాలు, ఆ సంబరాలు..మేం ఇవన్నీ మిస్సవుతున్నాం" అంటూ ఆర్సీబీ ఈ ట్వీట్ లో పేర్కొంది. తద్వారా తమ జట్టులో మేటి క్రికెటర్ టెస్టులకు ప్రకటించిన రిటైర్మెంట్ పై తమ అభిప్రాయాన్ని అంతే ఎమోషనల్ గా పంచుకుంది.

The walk,
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 12, 2025
Those shots,
Those expressions,
Those celebrations.
We’ll miss them all. We’ll miss them all. ❤️🩹#ThankYouVirat 👑
pic.twitter.com/b9jinS8dDu
ఈ సందర్భంగా ఆర్సీబీ తన ట్వీట్ కు ఓ వీడియోను కూడా జత చేసింది. ఇందులో భారత్-ఆస్ట్రేలియాల మధ్య గతంలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో కొహ్లీ ఆడిన షాట్లు, అతని హావభావాలు, సొగసైన ఆటను గుర్తుచేసేలా ఉన్న వీడియోలను షేర్ చేసింది. అలాగే ఫీల్డింగ్ లోనూ కొహ్లీ చురుకుదనం, ఇతర ఆటగాళ్లతో వ్యవహరించే తీరు అన్నీ కలగలిపి ఈ వీడియోను రూపొందించింది. ఈ వీడియో కింగ్ కొహ్లీ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. టెస్టు క్రికెట్ లో మేటి క్రికెటర్ గా పేరు తెచ్చుకున్న కొహ్లీ భారత్ కు 68 టెస్టుల్లో నాయకత్వం వహించి ఏకంగా 40 టెస్టుల్ని గెలిపించాడు. ఇదో రికార్డు..
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications