ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ చేరేదీ ఈ 4 జట్లే- టీమిండియా మాజీ ఆల్రౌండర్ ప్రిడిక్షన్స్
SRH vs LSG: ఐపీఎల్ మ్యాచ్లకు అర్థాన్నే మార్చివేసిన సన్రైజర్స్ హైదరాబాద్.. నేడు తన రెండో మ్యాచ్ ఆడబోతోంది. లక్నో సూపర్ జెయింట్స్తో తలపడబోతోంది. ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. తన సొంత గడ్డ.. ఉప్పల్ స్టేడియం దీనికి వేదిక.
తన తొలి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై వీరవిహారం చేసింది సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్. తొలుత బ్యాటింగ్కు దిగి 286 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సెంచరీతో రెచ్చిపోయాడు ఇషాన్ కిషన్. 106 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్.. ఇలా వచ్చిన వాళ్లందరూ ఉతికి ఆరేయడంతో ఆ స్కోర్ సాధ్యపడింది.

అనంతరం బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్.. అద్భుతంగా పోరాడింది. 20 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 242 పరుగులు కొట్టింది. సంజు శాంసన్, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయిర్, శుభమ్ దుబే.. దుమ్ము దులిపారు. అదరగొట్టారు గానీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు.
సన్రైజర్స్ హైదరాబాద్ తన దూకుడును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. లక్నోసూపర్ జెయింట్స్పైనా ప్రతాపం చూపించాలనే పట్టుదలతో ఉంది. గత సీజన్లో లీగ్ దశలో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో చిత్తుగా ఓడింది లక్నో సూపర్ జెయింట్స్. లక్నో నిర్దేశించిన 167 పరుగులను ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా కొట్టి అవతల పడేసింది సన్రైజర్స్.
ఈ వారంలో జరిగిన మ్యాచ్లల్లో కోల్కత నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. తమ ప్రత్యర్థులను చిత్తు చేశాయి. తొలి మ్యాచ్లో ఓడిన కోల్కత నైట్ రైడర్స్ ఆ తరువాత గాడిన పడింది. తన రెండో రాజస్థాన్ రాయల్స్ను ఓడించింది. రెండు మ్యాచ్లు ఆడినా ఇంకా బోణీ కొట్టట్లేదు రాజస్థాన్.
తొలి వారంలోనే ఐపీఎల్ 2025 రసవత్తరంగా సాగుతున్న దశలో ఏఏ జట్లు ప్లేఆఫ్స్కు చేరుకుంటాయనే అంచనాలు ఇప్పుడిప్పుడే వెలువడుతున్నాయి. కొందరు మాజీ క్రికెటర్లు, ఆల్ రౌండర్లు తమ అంచనాలను వెల్లడిస్తోన్నారు. ప్లేఆఫ్స్పై అభిప్రాయాలను పంచుకుంటోన్నారు.
తాజాగా- టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ చేరే జట్ల గురించి వెల్లడించాడు. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ కేపిటల్స్.. ఈ నాలుగు జట్లే ప్లేఆఫ్స్ చేరుకుంటాయని కుండబద్దలు కొట్టాడు. ఈ లిస్ట్లో సన్రైజర్స్ హైదరాబాద్ లేకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications