నాడు రోహిత్- నేడు సూర్యా భాయ్: టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ చారిత్రాత్మక విజయం సాధించింది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం న్యూజిలాండ్ను 96 పరుగుల తేడాతో ఓడించి కప్పును ముద్దాడింది. ముచ్చటగా మూడోసారి టీ20 వరల్డ్ కప్ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ అయిదు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేయగా, న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయ్యింది. వరుస హాఫ్ సెంచరీలతో రాణించిన ఓపెనర్ సంజు శాంసన్ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డును గెలుచుకున్నాడు.
మ్యాచ్ ముగిసిన అనంతరం కేప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగానికి లోనయ్యాడు. పిచ్ కు ప్రణమిల్లాడు. అక్కడి మట్టిని తీసి నుదుట అద్దుకున్నాడు. కప్ ను తీసుకుని కొద్దిసేపు పిచ్ పైనే మౌనంగా కూర్చుండిపోయాడు. పోస్ట్ మ్యాచ్ ప్రెజేంటేషన్ సందర్భంగా విలేకరులతో మాట్లాడాడు. తన తదుపరి లక్ష్యం ఏమిటో వెల్లడించాడు. 2028లో లాస్ ఏంజిల్స్ లో జరగనున్న ప్రతిష్టాత్మక ఒలింపిక్స్లో పసిడి పతకం సాధించడమే తన నెక్స్ట్ గోల్ అని చెప్పాడు. ఇది దేశానికి గర్వకారణమౌతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఒలింపిక్స్ లో కొత్తగా జత అయిన అయిదు స్పోర్ట్స్ ఈవెంట్స్ లల్లో ఒకటి.. క్రికెట్. క్రికెట్ తో పాటు స్క్వాష్, ఫ్లాగ్ ఫుట్బాల్, బేస్బాల్/సాఫ్ట్బాల్, లాక్రోస్ ఉన్నాయి. లాస్ ఏంజిల్స్ లో జరిగే ఒలిపింక్స్ తో ఈ అయిదు గేమ్ లు కూడా మనుగడలోకి రాబోతోన్నాయి. ఆయా స్పోర్ట్స్ ఈవెంట్స్ ఒలింపిక్స్ లోకి ఇంట్రడ్యూస్ కావడం అదే తొలిసారి కానుంది. ఒలింపిక్స్లో క్రికెట్ కు సంబంధించిన అర్హత ప్రమాణాలు ఏమిటనేది ఇంకా ఫైనల్ కాలేదు.
ఇంకా రెండు సంవత్సరాల సమయం ఉన్నందున ఈ లోపే అర్హత ప్రమాణాలు ఖరారవుతాయి. దాదాపు 100 దేశాలు టీ20 అంతర్జాతీయ క్రికెట్ను ఆడడం వలన, అర్హత ప్రక్రియ తీవ్ర పోటీతో కూడుకుని ఉండబోతోంది. ఆతిథ్య దేశంగా అమెరికా ఈ టోర్నమెంట్లోకి ప్రత్యక్ష ప్రవేశం పొందే అవకాశం ఉంది. క్రికెట్ ఆడే దేశాల్లో అమెరికా కూడా ఒకటి. ప్రస్తుత టీ20 వరల్డ్ కప్ లోనూ ఆడిందీ జట్టు. ఫర్వాలేదనిపించుకుంది.
క్రికెట్ సహా మిగిలిన నాలుగు స్పోర్ట్స్ ఈవెంట్ల అరంగేట్రాన్ని లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ కమిటీ నిర్ధారించింది. దీనికి ఇంటర్నేషనల్ ఒలిపింక్స్ కమిటీ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదం తెలిపింది కూడా. 2028లో మొత్తం 351 ఈవెంట్లు జరగనున్నాయి. ఇది గత పారిస్ ఒలింపిక్స్ కంటే 22 ఈవెంట్లు ఎక్కువ. ప్రధాన అథ్లెట్ల కోటా 10,500. అయిదు కొత్త క్రీడల కోసం అదనంగా 698 మంది అథ్లెట్లను కేటాయించినట్లు ఐఓసీ వెల్లడించింది.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications