బెజవాడలోగూండా రాజ్
విజయవాడ: ఈమధ్య చాలా ఏళ్ళపాటు ప్రశాంతంగా ఉన్నవిజయవాడ నగరం అసెంబ్లీ ఎన్నికలతర్వాత అగ్నిగుండంగా మారుతున్నది. రాజకీయ కక్షలు,మాఫియా దౌర్జన్యాలు పడగవిప్పుతున్నాయి. గతంలో కుల ఘర్షణలుజరగ్గా ఇప్పుడు రౌడీలురాజ్యమేలుతున్నారు. ప్రైవేటు పంచాయితీలుయధేచ్ఛగా జరుగుతున్నాయి.కమిషనర్ వంటి పోలీసుఉన్నతాధికారుల నియామకంలో కూడారాజకీయ ఒత్తిడులు పనిచేస్తున్నాయి.
చంద్రబాబునాయుడు హయాంలో తొమ్మిదేళ్ళ టిడిపిపాలనలో విజయవాడలో శాంతి భద్రతలుబాగున్నాయి. ముఖ్యంగా సురేంద్రబాబుకమిషనర్గా ఉన్నప్పుడు రౌడీలకుఅన్నం దొరకని పరిస్ధితి ఏర్పడింది. పేకాటక్లబ్బులు పక్కనున్న గుంటూరు జిల్లాకుతరలిపోయాయి. మద్యం షాపులు, బార్లమీద గట్టి నిఘా ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ప్రభుత్వం అధికారంలోకి రావడంతోఇరవై ఏళ్ళ నాటి అరాచకం పునరావృతమయింది.
కంకిపాడుకాంగ్రెస్ ఎమ్మెల్యే దేవినేని నెహ్రూ ఇంట్లోజరిగిన ఒక ప్రైవేటు పంచాయితీవివాదాస్పదమైంది. దీనితో తనకుసంబంధం లేదని, ఎవరైనా నిరూపిస్తేరాజీనామా చేస్తానని నెహ్రూ బుధవారంప్రకటించారు. తెల్లకాగితంపైసంతకం చేసి, ఆరోపణలు రుజువైనతర్వాత రాజీనామా గురించి రాస్తాననిఆయన విలేకరులకు చూపించారు.
విజయవాడకాంగ్రెస్ ఎమ్మెల్యే వంగవీటిరాధాకృష్ణ అనుచరులు రౌడీరాజ్యంనడుపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.విజయవాడలో శాంతిభద్రతలుమెరుగుపడాలంటే నిప్పు లాంటి పోలీసుకమిషనర్ను నియమించి ఆయనకు పూర్తిస్వేచ్ఛ ఇవ్వవలసి ఉంటుంది.
త్వరలోతెలుగు సినిమా టీవీ
అనంత హత్యాకాండ
చిరుఇంటికి బాంబు బూచి
కోనేరు హంపికి అర్జున్
మరోనెల నోటికి చెర!
తెలంగాణపై రిలే డిలే
మంచి సినిమా గతి ఇంతేనా?
మేటిప్లేయర్ ద్రావిడ్
టాప్స్లాట్పై కైఫ్ కన్ను
పారితోషికాలుతగ్గింపు?
వేడెక్కిన సిద్ధిపేట
గాంధీజీ చివరి అడుగులు
పనివాళ్ళ పనికాదు
పులిరాజాఏమయ్యాడు?
చిత్ర హింస
కెసిఆర్ఏం చేస్తున్నట్లు?
రాజకీయరంగులు
పరిటాలకథ












Click it and Unblock the Notifications