సర్వే సంచలనం
హైదరాబాద్:కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యంగురించి ఆ పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్రఆర్ధికమంత్రి కొణిజేటి రోశయ్య ఎప్పుడూఇలా చెబుతూ ఉంటారు కాంగ్రెస్ పెద్ద పార్టీ.స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో మాకుప్రధాన ప్రతిపక్షం ఉందేది కాదు. అందువల్లమా పార్టీ వాళ్ళే కొందరు ప్రతిపక్షం పాత్రపోషించేవాళ్ళు. మాకు అంతర్గతప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఎక్కువ. అందువల్లఅలుగుళ్ళు, అసమ్మతులు మామూలే అని.
ఆయనమాటలను అక్షరాలా నిజం చేస్తున్నారు ఇప్పుడుకాంగ్రెస్ నాయకులు. పదేళ్ళుగాపదవులకు దూరంగా ఉన్న కాంగ్రెస్తమ్ముళ్ళు ఇప్పుడు అధికారం కోసం ఆవురావురుమంటున్నారు.కార్పొరేషన్ పదవుల పందేరం చేయడానికిముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికివణుకు పుడుతోంది. అధికారంలోకిరాగానే ఆయన నా అనుకున్న సుధీర్రెడ్డి,మల్లాది విష్ణు వంటి వారికి పదవులు ఇచ్చేశారు.ఇప్పుడాయన అన్ని గ్రూపులను సంతృప్తిపరచవలసి ఉంది.
మొన్నతూర్పు గోదావరి జిల్లా గ్రంధాలయ సంస్ధఅధ్యక్ష పదవిని భర్తీ చేశారు. దీనిమీద ఆజిల్లా కాంగ్రెస్ నాయకులు రచ్చ రచ్చ చేశారు.ఇంత చిన్న పదవి మీద రచ్చ జరిగితేరేపు కార్పొరేషన్ ఛైర్మన్ల భర్తీవిషయం ఎట్లాగన్న భయం వైఎస్నువేధిస్తున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.అంబటి రాంబాబు, కె.జనార్ధనరెడ్డి.ధర్మవరపు సుబ్రమణ్యం, జి.ఆదిశేషగిరిరావు వంటి వారికి పదవులుఖాయమని వార్తలు వస్తున్నా కార్పొరేషన్పదవుల జాబితా ఇంకా వెలుగు చూడలేదు.
డిసెంబర్మొదటి వారంలో జాబితా వెలుగు చూడవచ్చనిభావిస్తున్నారు. కేబినెట్ హోదాగల ప్రెస్అకాడమీ అధ్యక్షుడిని ఎంపిక చేసుకునేవిషయంలో కూడా చాలాకాలం తటపటాయించినరాజశేఖరరెడ్డి సీనియర్ జర్నలిస్టు దేవులపల్లిఅమర్కు ఈ పదవి ఇవ్వనున్నారు. ఈ ఎంపికనుకొన్ని జర్నలిస్టు గ్రూపులు వ్యతిరేకిస్తున్నప్పటికీరేపు ఈ నియామకానికి సంబంధించినప్రకటన వెలువడనుంది.
కాంగ్రెస్జేబులో మోహన్బాబు?
కాంగ్రెస్సర్కారా? కాంట్రాక్టర్ల సర్కారా?
ఒక అడుగు ముందుకు,రెండు వెనక్కి!
పవర్ ప్లస్ పవర్
సమాంతర శక్తులు!
ఇందిరమ్మ భూమి
ఇదొక రాజ్యకీయం.
అవినీతి వికేంద్రీకరణ
కాంగ్రెస్-టిఆర్ఎస్ కటీఫ్?
సోదరహాసం
ఐటీ మీద వైఎస్ దృష్టి
త్తెకాలపు సత్తెన్న
కప్పల తక్కెడ
మూడో పవర్ఫుల్ లేడీ
టికెట్-క్యాన్సిల్-ఒకతెలుగమ్మాయి
బాలకృష్ణ ఇంటిదొంగలేనా?
మంద భాగ్యనగరం
తెలంగాణకు ఎర్ర జెండా
ఛానళ్ళా? చేపల చెరువులా?
టిఆర్ఎస్లో ముసలం?
వార్ బహుముఖ విస్తరణ
ఎమ్యెల్యేకుకోటి!
ప్రత్యేక వ్యూహం!
వైఎస్ అసహనం












Click it and Unblock the Notifications