రామోజీఒక్కరేనా?
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే
జనరల్ Thursday, July 29 2004 ;?
హైదరాబాద్:విప్లవ కవి వరవరరావు ఈనాడు గ్రూపుసంస్ధల అధిపతి రామోజీరావుపై చేసినఆరోపణలు నిర్హేతుకంగా, తొందరపాటుగాఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.రామోజీరావును భూమి కబ్జాదారుడిగా,స్ధానిక ప్రజల శత్రువుగా వరవరరావుఆరోపించారు. రామోజీ ఫిల్మ్ సిటీని ఆనుకునేఉన్న దాదాపు పదిహేను వందల ఎకరాల్లోవార్త అధిపతి సంఘీనగర్ను నిర్మించారు.రామోజీరావు కంటే సంఘీ అక్కడి భూములనుతక్కువ రేట్లకు కొన్నారు.
సంఘీనగర్నిర్మించే సమయంలో స్ధానికి కూలీలను మట్టిపనిలో పెట్టుకుని వారు సరిగా పనిచేయకపోతేసంఘీ సూపర్వయిజర్లు గుర్రాల మీదవచ్చి కొరడాలతో కొట్టేవారని స్ధానిక ప్రజలు ఇప్పటికీచెబుతుంటారు. సంఘీనగర్ ఉన్న అనాజ్పూర్సర్పంచిగా సంఘీ ఎప్పుడూ తన మనిషి ఎన్నికయ్యేలాచూసుకుంటాడు. ఆ ప్రాంతాని ఆయన మధ్యయుగాలకు చెందిన రాజులా వ్యవహరిస్తూస్ధానికులను బానిసలుగా చూస్తున్నట్టు అనేకవార్తలు వచ్చాయి.
వరవరరావుఅండ్ కంపెనీకి సంఘీ మిత్రుడెలా అయ్యాడు?రామోజీ శత్రువు ఎలా అయ్యాడు? వర్గశత్రువుకు వరవరరావునిర్వచనమేమిటి?
స్ధానికప్రజల భూములను కొని వారిని భూమి లేని నిరుపేదలుగామార్చడం నేరమైతే రామోజీరావేకాదు సంఘీ కూడా నేరస్ధులే. సంఘీ మీదఒక్క మాట అనకుండా వరవరరావురామోజీ మీద విరుచుకు పడడం అసమంజసంకాదని ఎవరైనా అనగలరా?
Recent Stories
మొగిలిచెర్లలోవార్
సిద్దిపేట సీను
ఆంధ్రపైజయ చిందులు
మణికుమారికిసవతిపోరు!
కొడుకు రాజకీయంపై వైయస్
సైకిల్దిగిన బాబూఖాన్
సమైక్యనినాదం ఊపు
తిరగబడినరాత
బాబుపైబాలయ్య అసంతృప్తి!
సచిన్టెండూల్కర్ - ఇంటర్వ్యూ హోంపేజి












Click it and Unblock the Notifications
