జగన్ కే కాదు, కెసిఆర్ కూ చెక్

ఇటీవలి తెలంగాణ ఉద్యమాలను పరిగణనలోకి తీసుకుని బలమైన నాయకుడి అవసరాన్ని అధిష్టానం గుర్తించినట్లు సమాచారం. ఎస్సై పరీక్షల వాయిదా నేపథ్యంలో సీమాంధ్రలో తలెత్తిన ఆందోళనలను రోశయ్య అణచివేయలేకపోయారనే అభిప్రాయం ఉంది. తెలంగాణ కాంగ్రెసు నాయకులు దాదాపుగా కెసిఆర్ గొంతుతో మాట్లాడుతున్నారు. జైపాల్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే తెలంగాణకు చెందిన కాంగ్రెసు నాయకులను కట్టడి చేయడం సాధ్యమవుతుంది. జైపాల్ రెడ్డిని కాదని తెలంగాణ ఆందోళనలకు వారు ముందుకు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయని అంటున్నారు.
ఈ స్థితిలో తెలంగాణ కాంగ్రెసు నాయకుల్లోనే కాకుండా తెరాసలోనూ, తెలంగాణ ప్రజా సంఘాల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి నియామకాన్ని బట్టి తెలంగాణ పట్ల సోనియా అభిమతం కూడా బయటపడుతుందని భావిస్తున్నారు. డిసెంబర్ 31వ తేదీ తర్వాత తెలంగాణ ఇవ్వకపోతే సహాయ నిరాకరణ ఉద్యమం చేపడతామని కెసిఆర్ అంటున్నారు. తమ ఉద్యమం వచ్చే ఏడాది జనవరి నెలాఖరున ప్రారంభమవుతుందని చెబుతున్నారు. ఈ స్థితిలో కెసిఆర్ తో కాంగ్రెసు తెలంగాణ నాయకులు గొంతు కలిపే పరిస్థితి లేకుండా చూసుకోవాలనేది సోనియా అభిప్రాయంగా చెబుతున్నారు. తెలంగాణ ఇచ్చినా, ఇవ్వకపోయినా పరిస్థితి తమ అదుపులో మాత్రమే ఉండాలని, అలా అదుపు చేసే నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications