రోజాకు దారి దొరికింది

అకస్మాత్తుగా ఆమె రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకున్న తీరు బయటపడింది. రోజాను వైయస్ జగన్ ఓదార్పు యాత్ర ముగింపు సభకు నెల్లూరు ఆహ్వానించినట్లు శనివారం వార్తలు వచ్చాయి. ఆమె నెల్లూరు బహిరంగ సభలో వైయస్ జగన్ కూ పూర్తి మద్దతు ఇస్తూ ప్రసంగించారు. తన ప్రసంగ పాటవాన్ని నెల్లూరు బహిరంగ సభలో మరోసారి ప్రదర్సించారు. జగన్ నుంచి మించిన నాయకుడు లేడంటూ ప్రశంసించారు. వైయస్ జగన్ రాజకీయ శిబిరంలో ఆమె కూడా ప్రధాన పాత్రధారి అని నెల్లూరు సభ ద్వారా తెలిసి వచ్చింది.
ఇమేజ్ ఉన్న నాయకురాలిగా వైయస్ జగన్ శిబిరంలో ఆమె ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. చాలా మంది సినీ నటుల మాదిరిగా కాకుండా రోజా రాజకీయాల్లో కూడా రాటు దేలారు. రాజకీయంగా ఆమె ప్రధాన స్రవంతి రాజకీయ నాయకులను ఎదుర్కునే సత్తాను, వాదనపటిమను అలవరుచుకున్నారు. తెలుగు మహిళ అధ్యక్షురాలిగా ఆమె మద్య వ్యతిరేక ఉద్యమంలో చాలా చురుకైన పాత్ర పోషించారు. మహిళా సమస్యలపై ఆమె ఎప్పటికప్పుడు ప్రతిస్పందిస్తూ వచ్చారు. పార్టీలో ఆమె ఎదుగులను ఇచ్చగించని నాయకులను ఆమెను సైడ్ లైన్ చేసేందుకు సిద్ధపడ్డారని విమర్శలు వచ్చాయి. దాని వల్లనే ఆమె తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చినట్లు సమాచారం. దీంతో వైయస్ రాజశేఖర రెడ్డి ద్వారా కాంగ్రెసులో చేరడానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు వైయస్ జగన్ పార్టీ పెడితే ప్రధాన నాయకుల్లో ఆమె ఒకరవుతారనడంలో సందేహం లేదు.












Click it and Unblock the Notifications