జగన్ గుట్టు విప్పిన నారా లోకేష్
ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్రాజెక్టులో పెట్టుబడుల వ్యవహారాన్ని ఆ చానెల్ విప్పి చెప్పే ప్రయత్నం చేసింది. అథెనా అనే సంస్థకు ఎలా అనుబంధ సంస్థలు పుట్టుకొచ్చాయో స్పష్టం చేసింది. వైయస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వైయస్ రవీంద్రా రెడ్డి, అల్లుడు అనిల్ కుమార్లకు ఉన్న పెట్టుబడుల గుట్టు విప్పింది. పెట్టుబడులు పెట్టేందుకు పుట్టుకొచ్చిన సంస్థల పేర్లను కూడా తెలిపింది. అధికారాన్ని వినియోగించుకుని రాష్ట్రంలోని ఖనిజ సంపదను వైయస్ కుటుంబ సభ్యులు కొల్లగొడుతున్న వైనానికి ఇది అద్దం పడుతుందని కూడా చానెల్ వ్యాఖ్యానించింది.
పారిశ్రామిక రంగంలో ప్రగతి పథంలో సాగుతున్న మ్యాట్రిక్స్ నిమ్మగడ్డ ప్రసాద్, కార్వీ సంస్థ శివరామకృష్ణ, మరో సంస్థకు చెందిన తాతినేని వెంకటకృష్ణలను వైయస్ రాజశేఖర రెడ్డి చేరదీసి వారి ద్వారా కథంతా నడిపారని ఆరోపించింది. అయితే, అసలు విషయం ప్రజలకు తెలుసుననేది వైయస్ జగన్ శ్రీకాకుళం పర్యటన సందర్భంగా కూడా రుజువైంది. ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్రాజెక్టులో అనిల్ కుమార్కు వాటాలున్నాయనే విషయంపై వారు జగన్ను ప్రశ్నించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఆ ప్రాజెక్టుకు అనుమతిచ్చిన విషయంపై కూడా వారు అడిగారు.