మీడియాపై గుర్రుమంటున్న వర్మ

తన సినిమాలో తెలుగు సినిమాపై దుమ్మెత్తి పోసిన వర్మ ఓ టీవీ చానల్ తనను ఉతికి ఆరేస్తోందని ఆవేదన చెందారు. ఈ మేరకు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఏకే ఖాన్కు ఫిర్యాదు చేయడానికి శుక్రవారం వెళ్లారు. మీడియాపై వేసిన సెటైర్లకు ఆ టీవీ చానెల్ వర్మపై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
ఓ చేత్తో ల్యాప్టాప్, మరోచేత్తో మీడియా ప్రసారాల నిబంధనలకు సంబంధించిన పుస్తకాన్ని పట్టుకుని వచ్చిన వర్మ, కమిషనర్ను కలిశారు. సదరు చానల్ అప్పల్రాజు సినిమాపై ప్రసారం చేసిన కథనాన్ని ల్యాప్టాప్లో ఆయనకు చూపించారు. ఆ చానల్ తనను వ్యక్తిగతంగా దూషించిందని తెలిపారు. ఆ చానల్ నిబంధనలు అతిక్రమించినట్టు చెప్పారు. అయితే, మౌఖిక ఫిర్యాదు వల్ల తాము చేసేదేమిలేదని కమిషనర్ ఖాన్ తేల్చిచెప్పడంతో మళ్లీ వచ్చి కలుస్తానంటూ వర్మ వెనుదిరిగారు. రాతపూర్వకమైన ఫిర్యాదు చేయడానికి ఆయన ముందుకు రాలేదు.
తనకు పిచ్చెక్కిందని, మైండ్ దొబ్బిందని దూషిస్తూ టీవీ 9 కథనం ప్రసారం చేసిందన్నారు. ఇదే విషయాన్ని పోలీసు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లానని వివరించారు. మళ్లీ వచ్చి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తానని చెప్పారు. తాను ఇదంతా ప్రచారం కోసం చేయడం లేదని వర్మ పేర్కొన్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications