రాజీనామాలు: చిగురిస్తున్న జగన్ ఆశలు

చాలా మంది కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేస్తారని, కాంగ్రెసు డబ్బా ఖాళీ అవుతుందని కాంగ్రెసు పార్టీకి, శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేసిన జూపల్లి కృష్ణారావు అన్నారు. నవంబర్ 10వ తేదీ లోపల మరింత మంది శాసనసభ్యులు రాజీనామాలు చేసి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరుతారని రాజయ్య చెప్పారు. తాము చెరువుకు కోత పెట్టామని, త్వరలోనే గండిపడుతుందని ఆయన అన్నారు. దీన్ని బట్టి కాంగ్రెసు నుంచి మరింత మంది శాససభ్యులు కాంగ్రెసు నుంచి తప్పుకుంటారని అంటున్నారు.
కాంగ్రెసుకు చెందిన శాసనసభ్యులు మరింత మంది శాసనసభ్యులు రాజీనామాలు చేస్తున్న క్రమంలో తన వ్యూహానికి పదును పెట్టాలనే ఆలోచనలో జగన్ వర్గం ఉన్నట్లు తెలుస్తోంది. ముగ్గురు శాసనసభ్యుల రాజీనామాల వల్ల పెద్దగా నష్టం లేదని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అంటున్నా పరిస్థితి అంత సజావుగా లేదనేది అర్థమవుతూనే ఉన్నది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటివారు ఇంకా కాంగ్రెసులో ఉన్నారని అంటున్నారు. దాదాపు 30 మంది శాసనసభ్యులు జగన్ వెంట ఉన్నారు. వారికి తోడు తెలంగాణకు చెందిన మరో 30 మంది తోడైతే ప్రభుత్వ మనుగడ ప్రమాదంలో పడుతుంది. అందుకు వ్యూహం రచించి అమలు చేసే దిశగా జగన్ సాగే అవకాశాలున్నాయని అంటున్నారు. ఏమైనా, జగన్ శిబిరంలో కాస్తా ఆశలు చిగురిస్తున్నట్లే కనిపిస్తోంది. మరో పది మంది శాసనసభ్యులు రాజీనామాలు చేస్తే ప్రభుత్వ మనుగడ ప్రమాదంలో పడుతుందని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం అన్నారు.
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications