వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
టిడిపివారి ఆధిక్యత వల్లనే నందులకు టోకరా?
తెలుగుదేశం పార్టీ వారు ఎక్కువగా ఉన్నారనే దానికన్నా తెలుగు సినీ పరిశ్రమ రెండుగా విడిపోయింది. రాజకీయంగా రెండు గ్రూపులుగా విడిపోయిందనే విషయం కొత్త విషయమేమీ కాదు. ఈ రాజకీయాల వల్ల ప్రభుత్వంతో సినీ పరిశ్రమకు సంబంధాలు పెద్దగా కొనసాగడం లేదు. 2009, 2010 నంది అవార్డులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవి, నాటకరంగ అభివృద్ధి సంస్థ ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు వాటిని ప్రదానం చేయలేదు. 2011 అవార్డులను కూడా ప్రకటించే అవకాశం ఉంది. రాజకీయ కారణాల వల్లనే నంది అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరగడం లేదని అంటున్నారు.
నంది అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు కావడం సంప్రదాయం. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమయం ఇస్తే నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని, తగిన సమయంలో ఆ కార్యక్రమం ఉంటుందని సంస్థ అధికారులు అంటున్నారు.
Comments
English summary
The prestigious Nandi film awards are unlikely to take place this year also. The last time the function was held was on March 17, 2010 to give away the awards for the year 2008.
Story first published: Monday, February 20, 2012, 11:13 [IST]