వైయస్సార్ అనుచరుల్లో వణుకు?
ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ సాక్షిగా విచారించింది. వైయస్సార్ హయాంలో కెవిపి రామచందర్ రావు ఎంతో అధికారాన్ని అనుభవించారు. మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, అధికారులు ఆయన కోసం బారులు తీరేవారు. కెవిపిని ఇంత వేగంగా విచారణకు పిలుస్తుందని తాము అనుకోలేదని కాంగ్రెసు వర్గాలంటున్నాయి. కాంగ్రెసులోని మరింత మంది పెద్దలను సిబిఐ విచారించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తాను సిబిఐ సాక్షిగా విచారించిందని, విల్లా కొనుగోలుపై సమాచారం అడిగారని, తాను తనకు తెలిసిన వివరాలు చెప్పానని కెవిపి రామంచందర్ రావు అన్నారు. అంతకు మించి ఆయన ఏమీ చెప్పలేదు. తన భార్య పేరు మీద కెవిపి విల్లాను కొనుగోలు చేశారు. కెవిపిని సిబిఐ ప్రశ్నించడం ప్రారంభం మాత్రమేనని, మరింత మంది పెద్దలను సిబిఐ విచారిస్తుందని అంటున్నారు. విల్లాల కొనుగోలుకు సంబంధించి సిబిఐ ఇంతకు ముందు పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ను, కొంత మంది సినీ ప్రముఖులను విచారించింది.